Covid 19: 796 fresh cases reported in AP ఏపీలో ఒక్క రోజులో 796 కేసులు.. పదకొండు మరణాలు

Coronavirus in ap 796 new covid 19 cases state tally crosses 12 thousand mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh nears 12000 Mark after 796 new cases were reported in the last 24 hours, out of which 5480 have so far recovered and have been discharged, while 157 have died, the state health department said.

ఏపీలో కరోనా ఉదృతి.. ఒక్క రోజులో 796 కేసులు.. పదకొండు మరణాలు

Posted: 06/27/2020 06:27 PM IST
Coronavirus in ap 796 new covid 19 cases state tally crosses 12 thousand mark

(Image source from: Economictimes.indiatimes.com)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాదిమందిని తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు పది వేల మార్కుకు చేరువలో ఉన్నాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా వారం రోజులుగా ఐదు వందల మార్కుకు పైగానే సాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా పన్నెండు వేల మార్కును అధిగమించడం అందోళనకరం, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రోజూ రెండు వందలకు పైబడి నమోదువుతున్న కేసులు.. గడిచిన 24 గంటల వ్యవధిలో ఎనమిది వందలకు చేరువలో నమోదు కావడం ఆందోళన వ్యక్తం అయ్యింది.

తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా పదకొడు వేల మార్కుకు చేరువలో వుంది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 796 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు పదకొండు వేల మార్కును అందుకుంది. రాష్ట్రంలో మొత్తంగా 12,285 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చినవారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు కూడా వున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురు, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చినవారు 51 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. మొత్తంగా 56గా నమోదయ్యాయి. రాష్ట్రంలో మాత్రం 740 కేసులు నమోదైనట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రంలో ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 161 కేసుుల, తూర్పు గోదావరిలో 109, చిత్తూరు జిల్లాలో 84, గుంటూరులో 71, కర్నూలులో 69 కేసులు నమోదయ్యాయి, ఇక కృష్ణా జిల్లాలో 53, కడప జిల్లాలో 50 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 44 కేసులు, ప్రకాశం జిల్లాలో 26 కేసులు, నెల్లూరు జిల్లాలో 24, విశాఖపట్నంలో 34 కేసులు, బుజయనగరంలో 15 కేసులు నమోదయ్యాయి, అయితే ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు.

కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి పదిమంది అసువులు బాసారు. గడచిన 24 గంటల్లో  కృష్ణా జిల్లాలో నలుగురు , కర్నూలు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 157 చేరింది. కాగా 273 మంది కరోనా పేషంట్లు కోలుకోవడంతో వారిని ఇవాళ అసుప్రతి అధికారులు డిశ్చార్జ్ చేశారు. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5196కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం యాక్టివ్ గా వున్న కరోనా కేసులు 6648కు చేరాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 377గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 1815కు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles