ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఈ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఆయనను విజయవాడకు తరలించారు. ఈ అరెస్టు నేపథ్యంలో అచ్చెన్న ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. రాత్రిపూట పోలీసులు ఏకంగా దొంగలను అరెస్టు చేసినట్టుగా గేట్లు దూకి లోపకి వచ్చి మరీ అరెస్టు చేశారు. ముందుగా అచ్చెన్న ఇంటికి తనిఖీల కోసం వచ్చామని చెప్పిన పోలీసులు.. వెనువెంటనే అరెస్టుకు తెరలేపారు. అసలేం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు ఆయన అదుపులోకి తీసుకుని.. హుటాహుటిన విజయవాడకు తరలిందారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపగా.. అచ్చెన్నాయుడి అరెస్టుకు ఆయన హయాంలో జరిగిన ఈఎస్ఐ కుంభకోణమే కారణంగా పోలీసులు పేర్కోన్నారు.
2014 నుంచి 2019 వరకూ కొనసాగిన గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు ఏపీ కార్మిక మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. ఆ సమయంలో ఈఎస్ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, ప్రస్తుత కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం నేతృత్వంలోని విచారణ కమిటీ ఇప్పటికే, ప్రాథమిక, మధ్యంతర నివేదికలను సమర్పించగా, కాలం తీరిన మందులు కొన్నారని తేలింది. ఇదే సమయంలో అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని, దాదాపు రూ. 900 కోట్ల అక్రమాలు జరిగి వుంటాయని అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 200 మంది ఏసీబీ అధికారులు 100 మంది పోలీసుల సాయంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పరిధిలోని నిమ్మాడకు చేరుకుని ఆయన ఇంటిపై సోదాలు నిర్వహించి అరెస్టు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో నిమ్మాడలో ఆయనను అరెస్టు చేసిన అధికారులు.. అదే సమయంలో మరో పోలీసు అధికారుల బృందం ఈఎస్ఐ శాఖ డైరెక్టర్ గా వ్యవహరించిన రమేష్ కుమార్ ను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది, ఆయన తిరుపతిలో నివాసం ఉంటుండగా, గత రాత్రి, అచ్చెన్నాయుడితో పాటు, ఆయన ఇంటిపైనా ఏకకాలంలో దాడులు చేసిన అధికారులు, ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ లో ఆయనపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలావుండగా, అచ్చెన్నాయుడు చొరవతోనే రూ. 975 కోట్ల మందులను కొనుగోలు చేసిన అధికారులు, రూ. 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించారని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. మందుల కొనుగోలు నిమిత్తం రూ. 293 కోట్లు కేటాయించగా, రూ. 698 విలువైన మందులను కొని, ఖజానాకు రూ. 405 కోట్ల నష్టం కలిగించారన్న ఆరోపణలపై ఏసీబీ విచారణ ప్రారంభించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more