దేశంలో ఐదవ విడత లాక్ డౌన్ లో భాగంగా యావత్ దేశవ్యాప్తంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాల తలుపులు తెరుచుకున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధన ఆలయాలు భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ తిరుపతిగా బాసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. లక్ష్మీనృసింహస్వామి వారి దర్శనాలు ప్రారంభం కావడంతోనే భక్తులు ప్రత్యేక కైంకర్యపూజలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఇక స్వామివారి దర్శనానికి భక్తులతో పాటు స్థానికులు కూడా పోటీపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొవిడ్ నిబంధనలు ఆచరిస్తూ భక్తులు దర్శనానికి క్యూలైన్లలో వేచివున్నారు. భక్తులందరూ మాస్కులు తప్పక ధరించాలన్న నిబంధన కూడా అమల్లోకి వచ్చింంది. ఆలయ నిర్వాహకులు ఉదయం 8.30 గంటల నుంచి ఉచిత లఘు దర్శనాలను కల్పిస్తున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ దర్శనాలకు స్థానికులతోపాటు ఆలయానికి చెందిన ఉద్యోగులను అనుమతించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆలయంలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ టెస్టుల తర్వాతే భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఇక పదేళ్లలోపు చిన్నారులతో పాటు 65 ఏళ్ల పైబడిన పెద్దలను దర్శనాలకు అనుమతించడం లేదని ఆలయవర్గాలు తెలిపాయి.
స్వామి, అమ్మవార్ల దర్శనాలతోపాటు ప్రసాదాల విక్రయాలకూ ఏర్పాట్లు చేపట్టామని ఈవో గీతారెడ్డి తెలిపారు. ఆన్ లైన్లో రుసుము చెల్లించిన భక్తుల పేరిట పరోక్షంగా ఆర్జిత పూజలు కొనసాగిస్తామని ఆమె వివరించారు. ఆలయంలో ఏర్పాట్లను కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించారు. అటు...బెజవాడ కనక దుర్గమ్మ ఆలయంలో పలు ఆంక్షలతో భక్తులను దర్శనాలకు అనుమతించారు అధికారులు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముందుగా ట్రయల్ రన్ రూపంలో దర్శనాలు కల్పిస్తున్నారు. అనంతరం సామాన్య భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో దర్శనాలకు అనుమతించే ముందు భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more