ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అమరావతిని రాజధానిగా కొనసాగించే అవకాశాలు లేవని మంత్రి బొత్స సత్యానారాయణతో పాటు పలువురు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజధాని మారుతుందన్న విషయమై ఇటు రాష్ట్ర ప్రజలతో పాటు అటు అమరావతి రైతుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు కేంద్రం జారీ చేసిన భారత దేశ పఠంలోనూ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగానే వుండటంతో అందోళన నెలకొంది. అయితే ఆ తరువాత కేంద్రం జారీ చేసిన రెండో పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించింది. దీంతో కొంత క్లారిటీ వచ్చినా.. ఇంకా కొంత సంధిగ్ధం మాత్రం నెలకొంది.
అయితే తాజాగా దీనిపై జగన్ సర్కార్ క్లారిటి ఇచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శాసన మండలిలో చర్చ జరుగుతున్న సందర్భంలో టిడిపి సభ్యురాలు శమంతక మణి అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగుతుందని దీనిలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఆయన రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. దీంతో గత కొంత కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. దీని పై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
గతంలో కూడా బొత్స రాజధాని పై ప్రకటనలు చేశారు. అయితే ఇటీవల జరిగిన సమావేశాల్లో రాజధాని ప్రాంంతంలో పెండింగ్ పనులన్నింటిని వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో మంత్రి బొత్స శాసనమండలిలో ప్రకటన చేయడంతో రాజధాని అమరావతే అని స్పష్టమైతుంది. ఇది ప్రభుత్వం అధికారికంగా చెప్పిన ప్రకటనగానే భావించవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల రాజధాని పెండింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అమరావతే రాజధాని అని తేలడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more