జనసేన పార్టీ నుంచి సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి దిగి ఎన్నికల బరిలో దిగ్గజపార్టీలకు వణుకు పుట్టిస్తున్న క్రమంలో ఆయన సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రచార బరిలోకి దిగుతున్నారు. తొలుత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ యువవిభాగం యువరాజ్యానికి అధ్యక్షులుగా వున్న పవన్ కల్యాణ్ తమ అభ్యర్థుల విజయం కోసం ఉమ్మడి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి.. ప్రచారం హోరెత్తించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అభ్యర్థుల కోసం రంగంలోకి దిగుతున్నారని భావిస్తే అక్కడే పోరబడినట్టే. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నేతగా కోనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మాత్రమే ప్రచారం చేసేందుకు బరిలోకి దిగుతున్నారు. ఇంతకీ ఎవరా అభ్యర్థి అంటే తనకు సమీప బంధువైన తెలంగాణ చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. విద్యావంతుడు.. ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు రావాలని కాంక్షించే నేత.
తన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో నీటి ఎద్దడి అధికంగా వుండటం వల్ల రైతులు అనేక వ్యయప్రయాసలు పడినా.. నిత్యం సమస్యల గుండంలోనే చిక్కుకుంటారని భావించిన ఆయన.. వారికోసం కొత్త పంటలను పెంచాలని, అందుకు డిమాండ్లను కూడా సృష్టించాలన్న సృజనాత్మక అలోచనలు వున్న వ్యక్తి కోండా విశ్వేశ్వర రెడ్డి. శేరిలింగంపల్లి నుంచి తాండూరు వరకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా విస్తరించివున్న ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓ వైపు అధునాతన టెక్నాలజీతో యువత వేగంగా దూసుకెళ్లూ కనిపిస్తుండగా, మరోవైపు అభివృద్దికి దూరంగా వున్న పల్లెసీమలు ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంటాయి.
తన నియోజకవర్గ సమగ్రాభివృద్ది కోసం నిత్యం కృషి చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డికి తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతు ప్రకటించారు. ఆయనకు తరపున ఎన్నికల బరిలో నిలువనున్నారు. తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి.. చిరంజీవి కుటుంబానికి మధ్య బంధుత్వం కూడా వుండటం మరో ఆసక్తికర విషయం. చిరంజీవి కొడలు ఉపాసన కోణిదెలకు కోండా విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా చిన్నాన అవుతారు. దీంతో ఆయన తరపున ప్రచారం నిర్వహించాలని చిరంజీవి నిర్ణయం తీసుకున్నారని త్వరలో ప్రచారం షెడ్యూలు విడుదల చేస్తారని సమాచారం. ఈ విషయాన్ని తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more