కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలవరాన్ని రేకెతిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలతో అసహనానికి గురైన ఆయన వారిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేటుచేసుకుంటున్న పరిణామాలు, ఆ పార్టీ ఎమ్మెల్యేల తీరును ఇప్పటికైనా పార్టీ సీనియర్ నేతలు కట్టడి చేయాలని ఆయన అన్నారు.
సీనియర్ నేతలు చోరవ చేసుకుని పార్టీతో పాటు సంకీర్ణ ప్రభుత్వం సజావుగా నడిచేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పార్టీలో పరిస్థితిని చక్కదిద్దాలని సూచించిన ఆయన ఇకపై కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందని వారు భావించినా.. అలాంటి పరిణామాలే పునరావృతం చస్తామని వారు చెప్పినా తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు తాను సిద్దంగా వున్నానని హెచ్చరించారు.
బెంగళూరులో ఈరోజు మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి ఎక్కి కొట్టుకుంటే వారికే నష్టమనీ, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల బెంగళూరు శివార్లలోని ఈగల్ టన్ రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేశ్, తోటి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
#WATCH: Karnataka CM HD Kumaraswamy says "...If they want to continue with the same thing, I am ready to step down. They are crossing the line", when asked 'Congress MLAs are saying that Siddaramaiah is their CM'.' pic.twitter.com/qwErh4aEq4
— ANI (@ANI) January 28, 2019
అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పక్ష నేత సిద్దరామయ్య మీడియాపై రుసరుసలాడారు. మీడియా అత్యుత్సాహమే సంకీర్ణ ప్రభుత్వంలో అనార్థాలకు కారణంగా మారువుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మీరే వెళ్లి ఓ వ్యక్తితో తన అభిప్రాయాన్ని సేకరించి.. దాని రెండో వ్యక్తి వద్ద ప్రస్తావించి.. మూడో వ్యక్తి అభిప్రాయాన్ని సేకరించి.. నాలుగో వ్యక్తిని దానిపై స్పందించాలని కోరడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అంతేకాని.. వాస్తవానికి సమస్యే లేదని ఆయన తెలిపారు. తాను ముఖ్యమంత్రి కుమారస్వామితో మాట్లాడతానని చెప్పారు.
దీనిపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి కూడా స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నదాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ఆయన క్రితం ఐదేళ్లు కాలంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రజలకు అత్యుత్తమంగా సేవలందించారని అన్నారు. ప్రస్తుతం ఆయన తమ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తున్నారని, ఆయన తమ నేత అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కోనడంలో తప్పేముందని ప్రశ్నించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామి పాలనలోనూ ప్రజలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా వున్నారని అన్నారు.
Bengaluru: Karnataka Chief Minister HD Kumaraswamy meets Congress MLA Anand Singh who has been undergoing treatment following a brawl with Congress MLAs JN Ganesh and Bheema Naik pic.twitter.com/fk049DbHXH
— ANI (@ANI) January 26, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more