పదోతరగతి పరీక్షల షెడ్యూల్డు విడుదలైంది. పరీక్షా తేదీలు ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యే తేదీలను అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది, పరీక్షలు ముగిసిన తరువాత గతంలో వున్న 45 రోజుల వ్యవధిని ఈ సారి తగ్గించి కేవలం నెల రోజుల వ్యవధిలోనే పలిథాలను విడుదల చేస్తామని కూడా ఈ సందర్భంగా అంధ్రప్రదేశ్ విద్యాశాఖ వెల్లడించింది. అమరావతిలో మంత్రి ఘంటా శ్రీనివాసరావు ఈ మేరకు పరీక్షల టైమ్ టేబుల్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 29 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 7 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.
పరీక్షల కోసం ఇప్పటి వరకు మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 91 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు గుర్తించామని, ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను ప్రధానోపాధ్యాయులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షలు జరిగిన నెల రోజులకే ఫలితాలను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
పరీక్షల షెడ్యూలు..
ఫస్ట్ లాంగ్వేజ్- తెలుగు (పేపర్-1) 18-03-2019
ఫస్ట్ లాంగ్వేజ్- తెలుగు (పేపర్-2) 19-03-2019
సెకండ్ లాంగ్వేజ్- హిందీ 20-03-2019
థర్డ్ లాంగ్వేజ్- ఇంగ్లిష్ (పేపర్-1) 21-03-2019
థర్డ్ లాంగ్వేజ్- ఇంగ్లిష్ (పేపర్-2) 22-03-2019
మ్యాథమెటిక్స్ (పేపర్-1) 23-03-2019
మ్యాథమెటిక్స్ (పేపర్-2) 25-03-2019
ఫిజికల్ సైన్స్ (పేపర్ -1) 26-03-2019
బయాలాజికల్ సైన్స్ (పేపర్-2) 27-03-2019
సోషల్ స్డడీస్ (పేపర్-1) 28-03-2019
సోషల్ స్డడీస్ (పేపర్-2) 29-03-2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more