విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ పై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేందుకు ఏపీ పోలీసులు ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. వైఎస్ జగన్ చికిత్స పోందుతున్న సిటీ న్యూరో హాస్పిటల్ కు చేరుకున్న పోలీసులు మరికొద్దిసేపట్లో ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేయనున్నారు. నిన్న ఘటన జరుగగానే విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స చేయించుకున్న అనంతరం ఆయన.. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు చేరుకున్న విషయం తెలిసిందే.
దీంతో నిందితుడు శ్రీనివాస రావును అదుపులోకి తీసుకన్న సీఐఎస్ఎస్ అధికారులు.. ఆయనను ఏపీ పోలీసులకు అప్పగించారు. అయితే దాడిపై జగన్ తన పిర్యాదును ఇవ్వని నేపథ్యంలో అంధ్రప్రదేశ్ పోలీసులు ఇవాళ హైదరాబాద్ కు వచ్చి జగన్ వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. జగన్ పై జరిగిన దాడి విచారణకు ఏర్పాటు చేసిన సిట్ అధికారుల బృందంలోని అడిషనల్ డీసీపీ మహేంద్ర పాత్రుడు నేతృత్వంలో డీఎస్పీ నాగేశ్వరరావు, మరో ఇద్దరు ఇనస్పెక్టర్ల బృందం వచ్చింది. హత్యాయత్నానికి సంబంధించి, జగన్ చెప్పే వివరాలను వీరు రికార్డు చేయనున్నారు.
ఇక విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ లో కూర్చున్న జగన్ వద్దకు వెళ్లి.. తాను అభిమానినంటూ సెల్పీ దిగిన ఎయిర్ పోర్టు క్యాంటీన్ ఉద్యోగి శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ ఇచ్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎయిర్ పోర్టు పోలీసు స్టేషన్ పోలీసులు.., నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 (హత్యాయత్నం) ప్రకారం కేసును నమోదు చేసినట్టు పోలీస్ ఇనస్పెక్టర్ మల్లా శేషు వెల్లడించారు. కేసును దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
ఇదిలావుండగా, తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని ముమ్మిడివరం ప్రాంతంలో నివసించే నిందితుడు శ్రీనివాసరావు ఇంట్లో కేంద్ర దర్యాప్తు బృందాలు అకస్మిక దాడులు జరిపాయి. ఆయన నివాసంలోని అణువణువూ అన్వేషిస్తున్నాయి. దీంతో పాటు శ్రీనివాసరావు తల్లిదండ్రులను, ఆయన సోదరులను కూడా దాడి నేపథ్యంలో విచారిస్తున్నాయి. కాగా శ్రీనివాసరావు జగన్ కు వీరాభిమాని అని వారు వెల్లడించినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more