వేసవిలో భానుడి భగభగలను, ఉక్కపోతలను అనుభవించి.. ఇవేం ఉష్ణోగ్రతలురా దేవుడా.. ఎప్పుడు ఉపషసమం లభిస్తుందని వేచిచూస్తున్న తెలుగు రాష్ట్రవాసులకు వాతావరణ శాఖ శభవార్తను అందించింది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించినట్లేనని, నైరుతి రుతుపవనాలు కేరళను దాటి తమిళనాడు, రాయలసీమ మీదుగా తెలంగాణ వైపు విస్తరిస్తున్నాయని తెలిపింది.
మరోపక్క, హైదరాబాద్ లో ఈ ఉదయం నుంచి ప్రజలు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరిగినట్టు తెలుస్తోంది. సత్తుపల్లి, వరంగల్ ప్రాంతాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు స్వల్ప అంతరాయాలు కలిగాయి.
అటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తుంది. శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, విజయ నగరం జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. శ్రీకాకుళంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఆ జిల్లాలోని హిరమండలం భగీరథ పురంలో పిడుగుపడడంతో రాజు అనే 38 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
నెల్లూరు జిల్లాలో వర్షం కురుస్తోన్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రకాశం జిల్లా చీరాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. విశాఖపట్నంలోని పాడేరు, రావి కమతం, బచ్చయ్యపేటల్లో ఓ మోస్తరు వర్షం పడుతోంది. కడప, చిత్తూరు జిల్లాల్లోనూ రానున్న 3 గంటల్లో వర్షం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more