కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రభుత్వంపై ఇప్పటికే దేశ ప్రజల నుంచి పలు విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అటు పార్టీలు కూడా కేంద్రంపై యుద్దభేరీలను పూరించాయి. ఓ వైపు పార్లమెంటులో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణాలను ప్రవేశపెట్టి సభలో చర్చ జరగాలంటూ నినాదాలు చేస్తుండగానే ఇటు అందివచ్చిన అన్ని అవకాశాలను సజావుగా వాడుకుంటూ ప్రధాన విపక్షం కాంగ్రెస్ మరింతగా దూసుకెళ్తుంది. ఇందులో భాంగా ఏప్రీల్ 1న జరిగే 'ఫూల్స్ డే'ను కూడా కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా వాడుకుంది.
ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ప్రజలకు మరోమారు గుర్తు చేస్తూ.. వాటిని అమల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందం కొనసాగుతున్నా.. వాటిని ఘనంగా అమలుచేస్తున్నామంటూ ప్రచారం మాత్రం దేశవ్యాప్తంగా టీవీలలో అదరగొట్టడాన్ని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్.. దానినే అస్త్రంగా తీసుకుని సర్కారు వైఫల్యాలపై బ్రేకింగ్ న్యూస్ అంటూ ఒక వీడియోను రూపొందించి, దీనిని సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియోను దేశ ప్రజల వీక్షణతో సంచలనంగా మారింది.
ఈ వీడియోలో ప్రధాని మోదీ తీసుకున్న డీమానిటైజేషన్ వల్ల అవినీతి అంతమైపోయిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. స్వచ్ఛభారత్ కు పీఎన్బీ నిందితులు పెద్దఎత్తున మద్దతిస్తున్నారని తెలిపింది. చెత్తాచెదారంతో నిండిన గంగా నదిలో మోదీ చిత్రపటం కూడా స్వచ్ఛంగా కనిపిస్తోందని ఎద్దేవా చేసింది. మోదీ సర్కార్ 200 కోట్ల ఉద్యోగాలు కల్పించిందని, ఇప్పుడు అంగారక గ్రహం నుంచి గ్రహాంతరవాసులు వచ్చి భారత్ లో ఉద్యోగాలు చేస్తున్నారని వ్యంగ్యంగా పేర్కొంది. దేశంలోని స్మార్ట్ సిటీల్లో చెత్తను రోబోలు సేకరిస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోలో ఎద్దేవా చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more