ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న విధంగా ప్రత్యేక హోదా, విశాఖపట్నానికి రైల్వే జోన్ లపై కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు కావాల్సిందేనని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ 2018-19 బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగా, ఉభయ సభలనూ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
విభజన చట్టంలోని ఎన్నో హామీలు అమలు కావాల్సి వుందని వెల్లడించిన ఆయన, విభజన గాయాల నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని అన్నారు. విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పారు. ఆస్తులను ప్రాంతాల వారీగా, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచారని గుర్తు చేసిన ఆయన, తన ప్రభుత్వం మూడున్నరేళ్లుగా హామీల అమలు కోసం ప్రయత్నం సాగిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజల్లో ఎంతో అసంతృప్తి నెలకొని ఉందని, అది తొలగాలంటే, కేంద్రం చొరవ చూపించాల్సిందేనని నరసింహన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత అన్న మాట లేకుండా చేయగలిగామని ఆయన అన్నారు.
సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం...
గత సంవత్సరం 11.31 శాతం వృద్ధి రేటును సాధించామని వెల్లడించిన ఆయన విభజన హామీల అమలుపై కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని తెలిపారు. రాష్ట్రానికి ఇంకా రాజధాని ఏర్పడలేదని, ప్రధాన ఆర్థిక వనరులను కోల్పోయామని, రెవెన్యూ లోటు, తక్కువ ఆదాయం, ఆస్తుల పంపిణీ పూర్తికాకపోవడంతో కొత్త రాష్ట్రానికి కష్టాలు మరింతగా పెరిగాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ లో సూచించిన విధంగా ఆస్తుల పంపిణీ చేపట్టాలని కోరారు. అసెంబ్లీలో సీట్ల పెంపు, పన్ను విధింపు విషయాల్లో తేడాలను పరిష్కరించాల్సి వుందని అన్నారు. కేంద్ర నిధులతో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, అవమాన భారంతో ఆగ్రహంగా ఉన్నారని, కష్టాలు తీర్చి, ఆగ్రహాన్ని చల్లార్చాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపైనే ఉన్నదని నరసింహన్ అభిప్రాయపడ్డారు. అమరావతికి ఆర్థిక సహాయం, జాతీయ ప్రాముఖ్యత గల సంస్థల ఏర్పాటుకు త్వరితగతిన కృషి చేయాలని గవర్నర్ సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more