మెట్రో జర్నీ కోసం హైదరాబాదీలు ఉవ్విళ్లూరుతున్నారు. ఫ్యామిలీలతో సహా ప్రయాణం కోసం ఎగబడిపోతున్నారు. అయితే మెట్రో స్మార్ట్ కార్డు ఉన్న వారు స్టేషన్ లలో కలియతిరిగితే మాత్రం వారికి ఊహించని పరిణామాలే ఎదురవుతున్నాయి. పెయిడ్ ఏరియాలో స్మార్ట్ కార్డుతో తిరిగితే అందులోని బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది.
ఉప్పల్కు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. స్మార్ట్కార్డు కోసం రూ.200 చెల్లిస్తే అందులో రూ.100 ప్రయాణం కోసం వాడుకోవచ్చు. కానీ, సదరు వ్యక్తికి బయటకు వచ్చే ముందు చూసుకుంటే కార్డులో మిగిలింది కేవలం పన్నెండు రూపాయలే. రూ.88 మాయమైపోయాయి. స్టేషన్లోకి ప్రవేశించాక రైలు ఎక్కకుండా అన్ని ప్రాంతాలు అలా చూసొద్దామని ఓ గంటసేపు అక్కడే తిరిగితే స్మార్ట్కార్డులోని సొమ్ము కరిగిపోతుంది. అందుకే అరగంట లోపే బయటకు రావడం ఉత్తమం. లేదంటే మనకు తెలియకుండానే స్మార్ట్కార్డులోని సొమ్మంతా స్వాహా అయిపోతుంది.
స్మార్ట్కార్డుతో పెయిడ్ ఏరియాలోకి ప్రవేశించి రైలు ఎక్కకపోయినా చార్జీలు కట్ అవుతూనే ఉంటాయి. స్టేషన్లో ఉన్నంత సేపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఫైన్ల గోల...
ఒకే రూట్.. ఒకే ట్రెయిన్ అన్న కన్ఫ్యూజన్ తో చాలా మంది ఫైన్లు కట్టాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. నాగోల్ లేక ఉప్పల్ నుంచి నేరుగా మియాపూర్కు వెళ్లాలనుకున్నవారు మధ్యలో అమీర్పేటలో రైలు మారాల్సి ఉంటుంది. ఒకవేళ టిక్కెట్ మియాపూర్ వరకు తీసుకున్నప్పటికీ అమీర్పేటలో దాన్ని మార్చుకోవాల్సిందే. అది తెలీక చాలా మంది టికెట్ మార్చుకోకుండా మరో ట్రైన్ ఎక్కేసి మియాపూర్లో దిగుతున్నారు. దీంతో వారు అక్కడ ఫైన్ కట్టాల్సి వస్తోంది. స్మార్ట్ కార్డు ఉన్నవాళ్లు కూడా అమీర్పేటలో దిగిన తరువాత తమ కార్డును స్వైప్ చేయాల్సి ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more