కాలీవుడ్ హీరో విజయ్ నటించిన చిత్రంలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు వుండటం వల్ల ఇది తమ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోడీ విధానాలకు వ్యతిరేకంగా వుందని వార్తలతో వివాదస్పదం అయ్యింది,. దీంతో రంగంలోకి దిగిన తమిళనాడు బీజేపి నేత హెచ్. రాజా ఈ చిత్రాన్ని తాను పైరసీ సీడీలో చూశానని చెప్పి.. బీజేపి పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు వున్నాయని వివాదానికి మరింత అజ్యం పోశారు. దీంతో దీపావళి రోజున విడుదలైన ఈ చిత్రం అటు థీయేటర్లతో పాటు ఇటు రాజకీయవర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ క్రమంలో నడిఘర్ సంఘం అధ్యక్షుడు హీరో విశాల్ రంగంలోకి దిగి.. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి.. జాతీయ నేతగా కొనసాగుతూ.. పైరసీ సీడీలో సినిమాను చూశాను అని చెప్పడానికి సిగ్గులేదా..? అని ప్రశ్నించాడు. దీంతో మరుసటి రోజున ఆయన నివాసం, కార్యాలయాలపై బీజేపి క్షక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. జీఎస్టీ అధికారులను రంగంలోకి దింపి ఆయన తనిఖీలు చేపట్టారన్న వార్త తమిళనాడు మీడియా సంస్థలు ప్రకటించాయి. అయితే తాము ఎలాంటి దాడులు చేయలేదని జీఎస్టీఐ అధికారులు ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.
ఇలా ఈ వివాదం సద్దుమణిగిందని అనుకుంటున్న క్రమంలోనే ఈ చిత్రానికి బీజేపి నేత రాజా మతం రంగు పులిమారు. కాలీవుడ్ హీరో విజయ్ మతం మార్చుకున్నాడని నిన్న సంచలన ఆరోపణలు చేసిన ఆయన ఇవాళ వివాదానికి మరింత ఆజ్యం పోశారు. విజయ్ ఓటరు ఐడీ కార్డును (నెంబరు టీఏయూ 1900109)ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఇప్పటికైనా నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఓటర్ ఐడీలో విజయ్ పేరు జోసఫ్ విజయ్ అని ఉంది.
దీంతో పాటు సీ జోసఫ్ విజయ్, మూవీ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ అని ఉన్న ఓ లెటర్ హెడ్ ను కూడా పోస్టు చేశారు. నిజాన్ని ఎవరూ చంపలేరని వ్యాఖ్యానించిన ఆయన, మెర్సిల్ సినిమాలోని డైలాగ్ "దేవాలయాల కన్నా ముందు ఆసుపత్రులను నిర్మించాలి"ని ప్రస్తావిస్తూ, గత 20 సంవత్సరాల్లో 17,500 చర్చిలు, 9,700 మసీదులు, 370 దేవాలయాలు ఇండియాలో నిర్మితమయ్యయి. వీటిల్లో వేటిని కూల్చి ఆసుపత్రులు కట్టిద్దామో విజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు.
Truth is bitter pic.twitter.com/woFdxOntRn
— H Raja (@HRajaBJP) October 22, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more