ధరలు మండిపోతున్నఈ రోజుల్లో కడుపునిండా తిండి తినడమే గగనమనుకుంటే.. మధ్యలో కల్తీ అనేది ఒకటి వచ్చి చేరటంతో జనాల ఒళ్లు, జేబు గుల్లయిపోతున్నాయి. అయితే వందలు, వేలు పోసి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్ఛితంగా నాణ్యమైన ఫుడ్ నే ఆశిస్తాం. దాని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రైల్వే రంగంలో అందించే ఆహారం వెనుక ఉన్న కథ తెలిస్తే మాత్రం మీరు విస్తూపోవటం ఖాయం.
రైల్వే క్యాటరింగ్ సేవలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిట్ రిపోర్టులో షాకింగ్ వాస్తవాలు వెల్లడయ్యాయి. రైళ్లలో అందిస్తున్న ఆహారం అసలు మనిషనేవాడు తినలేడని చెబుతోంది. ఈమేరకు 80 రైళ్లు, 70 స్టేషన్లలో సోదాలు నిర్వహించిన కాగ్ బృందం ఓ నివేదికను తయారు చేసింది. కలుషిత ఆహారం, రీసైకిల్ చేసిన ఆహార పదార్థాలు, జీవితకాలం చెల్లిన సీసాలు, ప్యాక్లలో ఆహారం అందిస్తున్నట్టు వివరించింది. అలాగే గుర్తింపు లేని బ్రాండ్ల వాటర్ బాటిళ్లను స్టేషన్లలో విక్రయిస్తున్నట్టు తెలిపింది.
ఆహార పదార్థాలపై మూతలు ఉండడం లేదు. ఈగలు, దోమలు, బొద్దింకలు, ఎలుకలు తదితరాలు వాటి పైనుంచే తిరుగుతున్నాయి. తాము నిర్వహించిన తనిఖీల్లో పరిశుభ్రత మచ్చుకైనా కనిపించలేదు అని కాగ్ పేర్కొంది. పైగా ఆర్డర్ చేసిన ఆహారానికి బిల్లులు కూడా ఇవ్వడం లేదని వివరించింది. ఇది అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చే వాళ్లకే కాదు.. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ల విషయంలోనూ జరుగుతోందంట. స్టేషన్లలో కూడా అపరిశుభ్రమైన నీళ్లు సరఫరా అవుతున్నాయని, చెత్త డబ్బాలపై మూతలు పెట్టడం లేదని పేర్కొంది.
కేటరింగ్ విధానంలో తరచూ మారుతున్న విధానాల్లోనే తప్పు ఉన్నట్టు ఆడిట్ గుర్తించింది. విధానాలు తరచూ మారుతుండడం వల్ల సేవల్లో అనిశ్చితి నెలకొన్నట్టు తేల్చింది. ఈ నివేదిక నేడు (శుక్రవారం) పార్లమెంటులో కాగ్ ప్రవేశపెట్టబోతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more