డ్రాగన్ దేశం భారత్ తో యుధ్దానికి సన్నధమవుతుందా..? అంటే అవునన్న సంకేతాలే వినబడుతున్నాయి. సిక్కిం సరిహద్దులోని డోక్లాం వివాదంతో ఇరు దేశాలు ప్రత్యక్షంగా చర్చించుకుంటే మంచిదని ఏకంగా అగ్రరాజ్యం చెప్పినా.. వాటిని పెడచెవిన పెట్టి మరీ తీవ్రపరిణామాలు కలిగించే యుద్దానికే చైనా మొగ్గుచూపుతుంది. సరిహద్దు నుంచి భారత బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని లేదంటే సమస్యకు యుద్ధమే పరిష్కారమని పదే పదే హెచ్చరికలు చేసిన చైనా.. ఇక అ దిశగా అడుగులు కూడా వేస్తూ.. తన సైన్యాన్ని, భారీగా మిలిటరీ ఆయుధాలను, పరికరాలను టిబెట్ కు తరలించినట్లు కథనాలు వస్తున్నాయి.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైన్యంతో పాటుగా వేల టన్నుల కొద్ది మిలిటరీ పరికరాలు, ఆర్మీ వాహనాలను గత నెల చివర్లోనే డ్రాగన్ దేశం టిబెట్ కు తరలించినట్లు హాంకాంగ్ కు చెందిన దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొనడంతో ఇది కాస్త చర్యనీయాంశంగా మారింది. రోడ్డు, రైలు మార్గం ద్వారా యుద్ద సామాగ్రిని, యుద్ద వాహనాలను తరలించినట్లు వెల్లడించింది. భారత్ తో సమస్యను పరిష్కారం కాని పక్షంలో యుద్దాన్ని ప్రకటించే యోచనలో చైనా వుందని, అందులో భాగంగానే సైన్యాన్ని టిబెట్ కు పంపించినట్లు హాంకాంగ్ మీడియా తన కథనంలో పేర్కొంది.
ఈ విషయాన్ని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మీడియా పీఎల్ఏ డెయిలీ కూడా ధ్రువీకరించడంతో ఇక ఇరు దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకుంటాయా..? అన్న అందోళన కూడా రేకెత్తుతుంది. కాగా, యుద్దానికి సన్నధం అవుతున్నారన్న వాక్యలను చైనా సైన్యం కమాండర్ ఒకరు తోసిపుచ్చారు. దౌత్యపరమైన చర్చలకు కూడా మిలిటరీ సిద్ధంగా ఉండటం అవసరమని ఆయన చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తుంది. అయితే భారత్ మాత్రం ఇప్పటికీ శాంతియుత పరిష్కరాన్నే కోరుకుంటున్నామని, డోక్లాం వివాదంలో దౌత్యపరమైన చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని చెబుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more