బ్యూటీషియన్ శిరీష అలియాస్ విజయలక్ష్మి సూసైడ్ కేసులో అసలు నివేదిక రానే వచ్చింది. ఆమెపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలపై దుస్తులను ఫోరెన్సిక్ టెస్ట్ లకు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసుకు కీలకం కానున్న ఆ నివేదిక కోసం అంతా ఆత్రుతగా ఎదురు చూశారు. మొన్న ప్రాథమిక రిపోర్ట్ లో రేప్ జరగలేదనే తేల్చగా, తుది నివేదిక వరకు వేచి చూడాల్సిందేనన్న పోలీసుల ప్రకటనతో అది మరింత నాటకీయంగా మారింది.
చివరకు నేడు రిలీజ్ చేసిన ఫైనల్ రిపోర్ట్ లోనూ ఆమెపై అత్యాచారం జరగలేదనే తేలిందని పోలీసులు ప్రకటించారు. అవి కేవలం ఆహారపు మరకలు మాత్రమేనని వెల్లడించారు. ఆర్జే స్టూడియోలో పార్ట్ టైం బ్యూటీషియన్ గా పని చేసే శిరీష ఆఫీస్ లోనే ఉరేసుకుని చనిపోయిన, ఆపై బంధువుల విమర్శలతో రంగంలోకి దిగిన పోలీసులు వారి అనుమానాలను నివృత్తి చేసే పనిలో పడ్డారు. ఆమె తల్లిదండ్రులు, భర్త, బంధువులను గురువారం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లారు. గొడవ అంతా పోలీస్ క్వార్టర్స్లో జరగలేదని, రెండు కిలో మీటర్ల దూరంలోనే అంతా జరిగిందని వారు బంధువులకు వివరించారు.
అంతేకాదు కాల్ లిస్ట్, మెసేజ్లు, ప్రింట్ ఆధారాలను వారికి పోలీసులు చూపించారు. అంతేకాదు, రెండ్రోజుల్లో ఫోరెన్సిక్ నివేదిక ఇస్తామని కూడా చెప్పటంతో వారు వేచి చూశారు. ఇంతలోనే రిపోర్ట్ రావటం, ఆమె అత్యాచారానికి గురి కాలేదన్న విషయం తేటతెల్లమైంది. ఇంకోపక్క తేజస్విని ని మరోసారి పిలిపించుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు మరోసారి ఆమెను గట్టిగా విచారించినట్లు తెలుస్తోంది. అయితే తాను శిరీషను తప్పుకోవాలని మాత్రమే కోరానని, ఈ కేసుతో తనకేం సంబంధం లేదని తేజస్విని వాపోయిందంట. దీంతో శిరీషది సూసైడే అని కన్ఫర్మ్ కావటంతో కేసు క్లోజ్ అయినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more