బ్యూటీషియన్ శిరీష సైసైడ్ కేసు విచారణ లోతుగా వెళ్లే కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో నిందితులుగా ఉన్న రాజీవ్, శ్రవణ్ నిందితులను చంచల్ గూడ జైలు నుంచి రిమాండ్ లోకి తీసుకున్న పోలీసులు విడి విడిగా విచారణ జరుపుతున్నారు. రాజీవ్, శ్రవణ్ లను విచారించిన వీడియోల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక విచారణలో రాజీవ్ సంచలన విషయాలనే వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ రోజున శిరీషను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లామని, శ్రవణ్ తనకు అన్ని విధాలా సహకరించాడని నిందితుడు రాజీవ్ వెల్లడించాడు.
తన ప్రియురాలు తేజస్వినిని పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని, తమ ఇంట్లో వాళ్లు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, పెళ్లికి ముందే శిరీషను, తేజస్వినిని వదిలించుకోవాలని అనుకున్నానని, అయితే, శిరీషను చంపాలనే ఉద్దేశం మాత్రం తనకు లేదని రాజీవ్ చెప్పినట్టు తెలుస్తోంది. తేజస్విని తనను పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని తన తల్లికి చెప్పిందని, అందుకు తన ఇంట్లో వాళ్లు అంగీకరించలేదని, ఆ తర్వాత శిరీషతో గొడవపడి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తేజస్విని వెళ్లి ఫిర్యాదు చేసినట్టు పోలీసుల విచారణలో రాజీవ్ చెప్పినట్టు సమాచారం.
శిరీష, తేజస్విని మధ్య గొడవతో నలిగిపోయి, శ్రవణ్ సాయంతో ఎస్పై ప్రభాకర్ రెడ్డికి చెప్పి శిరీషను బెదిరించాలని అనుకున్న విషయాన్ని రాజీవ్ బయటపెట్టాడు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి లోపల ఏం చేశాడో తెలియదు కానీ, శిరీష మాత్రం మనస్తాపానికి గురైందని చెప్పాడు. కారులో తిరిగి వస్తుండగా శిరీష అరుపులు, కేకలతో ఎవరైనా చూస్తారనే భయంతో ఆమెపై దాడి చేశానంటూ నిందితుడు రాజీవ్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే రేప్ జరిగిందన్న విషయంపై మాత్రం ఎలాంటి వివరణ ఇచ్చారో బయటకు పొక్కనీయటం లేదు.
శ్రవణ్ ను నేడు మరోసారి విచారించే ఛాన్స్ ఉంది. మరోవైపు కుక్కునూరుపల్లి పీఎస్ లో ఏం జరిగిందో తెలిస్తేనే మిస్టరీ వీడే అవకాశం ఉంది. దీంతో ఇద్దర్నీ వేర్వేరుగా అక్కడికి తీసుకెళ్లి మళ్లీ విడివిడిగా విచారణ జరపనున్నారు. ఇంకోవైపు కేసులో పేర్లు వినిపిస్తున్న నందు, నవీన్ లు ఎవరో తెలీదని వీరు చెబుతున్నప్పటికీ, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అంటున్నారు. శిరీష కుటుంబ సభ్యుల లెవనెత్తిన అనుమానాల నేపథ్యంలోనే విచారణ వేగవంతం చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more