Woman Gang-Raped, her toddler thrown to death from auto హర్యానాలో దారుణం.. తల్లిపై గ్యాంగ్ రేప్.. చంటిపాప హత్య

Woman gang raped her toddler thrown to death from auto

rape, gangrape, married woman, toddler, auto, Gurgaon, Crime against women, IMT Manesar, Woman raped in auto, Delhi-Gurgaon Expressway, Haryana

In a horrific incident, a 22-year-old woman was allegedly gang-raped by three men in Gurgaon after throwing her nine-month old daughter off the autorickshaw in which she was travelling, leading to the death of her child.

హర్యానాలో దారుణం.. తల్లిపై గ్యాంగ్ రేప్.. చంటిపాప హత్య

Posted: 06/06/2017 03:49 PM IST
Woman gang raped her toddler thrown to death from auto

హర్యానాలో దారుణం జరిగింది. చిట్టి తల్లిని భుజాన వేసుకుని తమ బంధువుల ఇంటికి బయలుదేరిన ఇరవై ఏళ్ల వివాహితపై ముగ్గురు కామాందులు కదులుతున్న అటోలోనే అమెపై అత్యాచారం చేశారు. దేశరాజధానిలో నిర్భయ ఘటనను మాత్రమే ఎత్తిచూపుతున్న సమాజానికి అ తరువాత అబలలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా పట్టడం లేదు. ఎన్నికల సమయం కాబట్టే అప్పుడు రాజకీయా పార్టీలు వెనుకుండి నిర్భయ ఘటనను క్యాష్ చేసుకోవాలని చూశాన్న విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో అదే నిజమా అన్న అనుమానం ప్రస్తుతం సగటు పౌరుడికి కలుగుతుంది.

గత ఆరవై ఏళ్లుగా విదేశాల ముందు మన దేశం తలదించుకుందని, ఇప్పటికైనా తల ఎత్తుకునే పరిస్థితికి రావాలని ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపును అపహాస్యం అయ్యేలా.. దేశంలో అబలలకు అసలు రక్షణ లేకుండా పోయింది. అంతే కాదు భారత్ పర్యటనకు వచ్చే వీదేశీవనితలను కూడా ఆయా దేశాలు హెచ్చరిస్తున్నాయంటే దేశ గౌరవానికి ఎంత అప్రతిష్ట.. ఎంత అమర్యాద. అయినా వీటి గురించి దేశీయ కోణంలో ఎవరూ అలోచించడం లేదు. ఇది కూడా మన దేశ అడపడచులు అగౌరవమేనని చెప్పాలి.

హర్యానా రాష్ట్రంలోని గుర్ గావ్ లో ఓ మహిళను ఆటోలోనే గ్యాంగ్ రేప్ చేసిన ఘటన కలకలం సృష్టించింది. ఆటో  డ్రైవర్ సహాయంతో… ఆటోలో అప్పటికే ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యం చేశారు. మహిళ చేతిలో ఉన్న తొమ్మిది నెలల పసిబిడ్డను వేగంగా వెళ్తున్న ఆటోలో నుంచి కిందకు విసిరేసి.. మరీ మహిళపై దారుణానికి ఒడిగట్టారు దుండగులు. దీంతో తన బిడ్డ కనిపించడం లేదని, అమెను వెతికి పెట్టాల్సిందిగా పోలీస్ స్టేషన్ ను అశ్రయించిన బాధిత మహిళ.. తనపై జరిగిన అఘాయిత్యంపై చెప్పాలా..? వద్దా అన్న సంకోచంలో చివరికి పోలీసు అధికారులకు రోదిస్తూ చెప్పింది.

మహిళ పిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిడ్డ అచూకీని కనుగోన్నా.. అప్పటికే అమె చనిపోయిందని తెలిపారు. మే29న ఈ దారుణఘటన జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పెద్దు చెప్పిన ఓ మాట మాత్రం ఇక్కడ గుర్తుచేసుకోక తప్పదు. తన కోసమే తన శత్రువు అన్న విషయాన్ని ఆ వివాహిత గ్రహించి వుంటే ఇంత దారుణం జరిగివుండేది కాదు అని కూడా పలువురు అంటున్నారు. తన భర్తతో గొడవ పెట్టుకుని. బంధువుల ఇంటికి బయలుదేరి వెళుతున్న ఆమె… ఆ రాత్రి మనేసర్ సెక్టార్ల ఆటో ఎక్కింది. ఆ తర్వాత.. దుండగుల అరాచకానికి ఆమె బలైపోయింది. కాగా, పసిబిడ్డ చనిపోయిందని తేల్చిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  married woman  toddler  auto  Gurgaon  Crime against women  

Other Articles