హర్యానాలో దారుణం జరిగింది. చిట్టి తల్లిని భుజాన వేసుకుని తమ బంధువుల ఇంటికి బయలుదేరిన ఇరవై ఏళ్ల వివాహితపై ముగ్గురు కామాందులు కదులుతున్న అటోలోనే అమెపై అత్యాచారం చేశారు. దేశరాజధానిలో నిర్భయ ఘటనను మాత్రమే ఎత్తిచూపుతున్న సమాజానికి అ తరువాత అబలలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా పట్టడం లేదు. ఎన్నికల సమయం కాబట్టే అప్పుడు రాజకీయా పార్టీలు వెనుకుండి నిర్భయ ఘటనను క్యాష్ చేసుకోవాలని చూశాన్న విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో అదే నిజమా అన్న అనుమానం ప్రస్తుతం సగటు పౌరుడికి కలుగుతుంది.
గత ఆరవై ఏళ్లుగా విదేశాల ముందు మన దేశం తలదించుకుందని, ఇప్పటికైనా తల ఎత్తుకునే పరిస్థితికి రావాలని ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపును అపహాస్యం అయ్యేలా.. దేశంలో అబలలకు అసలు రక్షణ లేకుండా పోయింది. అంతే కాదు భారత్ పర్యటనకు వచ్చే వీదేశీవనితలను కూడా ఆయా దేశాలు హెచ్చరిస్తున్నాయంటే దేశ గౌరవానికి ఎంత అప్రతిష్ట.. ఎంత అమర్యాద. అయినా వీటి గురించి దేశీయ కోణంలో ఎవరూ అలోచించడం లేదు. ఇది కూడా మన దేశ అడపడచులు అగౌరవమేనని చెప్పాలి.
హర్యానా రాష్ట్రంలోని గుర్ గావ్ లో ఓ మహిళను ఆటోలోనే గ్యాంగ్ రేప్ చేసిన ఘటన కలకలం సృష్టించింది. ఆటో డ్రైవర్ సహాయంతో… ఆటోలో అప్పటికే ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యం చేశారు. మహిళ చేతిలో ఉన్న తొమ్మిది నెలల పసిబిడ్డను వేగంగా వెళ్తున్న ఆటోలో నుంచి కిందకు విసిరేసి.. మరీ మహిళపై దారుణానికి ఒడిగట్టారు దుండగులు. దీంతో తన బిడ్డ కనిపించడం లేదని, అమెను వెతికి పెట్టాల్సిందిగా పోలీస్ స్టేషన్ ను అశ్రయించిన బాధిత మహిళ.. తనపై జరిగిన అఘాయిత్యంపై చెప్పాలా..? వద్దా అన్న సంకోచంలో చివరికి పోలీసు అధికారులకు రోదిస్తూ చెప్పింది.
మహిళ పిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిడ్డ అచూకీని కనుగోన్నా.. అప్పటికే అమె చనిపోయిందని తెలిపారు. మే29న ఈ దారుణఘటన జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పెద్దు చెప్పిన ఓ మాట మాత్రం ఇక్కడ గుర్తుచేసుకోక తప్పదు. తన కోసమే తన శత్రువు అన్న విషయాన్ని ఆ వివాహిత గ్రహించి వుంటే ఇంత దారుణం జరిగివుండేది కాదు అని కూడా పలువురు అంటున్నారు. తన భర్తతో గొడవ పెట్టుకుని. బంధువుల ఇంటికి బయలుదేరి వెళుతున్న ఆమె… ఆ రాత్రి మనేసర్ సెక్టార్ల ఆటో ఎక్కింది. ఆ తర్వాత.. దుండగుల అరాచకానికి ఆమె బలైపోయింది. కాగా, పసిబిడ్డ చనిపోయిందని తేల్చిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more