మహిళా భద్రతే ప్రధాన లక్ష్యమంటూ చెప్పుకొస్తున్న బీజేపీ ప్రభుత్వ హయాంలో కూడా ఉత్తర ప్రదేశ్ ఏ మాత్రం సురక్షితం కాదని వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. వారం రోజుల్లో మూడు గ్యాంగ్ రేప్ లు జరగటమే కాదు.. నిన్న రాంపూర్ లో ఇద్దరు మహిళలను 14 మంది అసభ్యంగా తాకుతూ దారుణంగా వేధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై యోగి సర్కార్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక ఘటనపై స్పందించిన వివాదాస్పద నేత, మాజీ మంత్రి అజాం ఖాన్ షాకింగ్ కామెంట్లు చేశాడు. అమ్మాయిలు, మహిళలు అత్యాచారాల నుంచి తప్పించుకోవాలంటే ఇంటికే పరిమితం కావాలంటూ సలహా ఇస్తున్నాడు ఈ ఎస్పీ సీనియర్ నేత. వీడియోలో ఉన్న వ్యవహారం చాలా చిన్నదేనన్న రీతిలో మాట్లాడిన ఖాన్, యోగి పగ్గాలు చేపట్టాక ఈ దారుణాలు మరీ పెరిగిపోయాయంటూ విమర్శలకు దిగాడు. బులంద్ షర్ అత్యాచార ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని, అఖిలేష్ ప్రభుత్వాన్ని బద్నాం చేయటానికే అని.. కామెంట్లు చేసి తీవ్ర విమర్శల పాలయ్యాడు అజాం ఖాన్. ఇక ఇప్పుడు అమ్మాయిలు అలాంటి ప్రాంతాలకు వెళ్లిపోకపోవటమే మంచిదంటూ వ్యాఖ్యానించి మరో కాంట్రవర్సీకి రెడీ అయిపోయాడు.
ఇదిలా ఉంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలోని ఓ గ్రామ సమీపంలో 14 మంది యువకులు ఇద్దరు మహిళలను తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఆపై ఈ దారుణాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియా సైట్లలో పోస్టు చేశారు. వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు వేధింపుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చెట్ల కొమ్మలు అడ్డురావడంతో నిందితుల గుర్తింపు కష్టసాధ్యంగా ఉందని ఎస్పీ విపిన్ తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more