ధర్మ నిరపేక్ష(సెక్యులర్) సేవక్ సంఘ్ (డీఎస్ఎస్) ను ఆర్ఎస్ఎస్ కౌంటర్ గా ప్రారంభించాడు లాలూ తనయుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. బీజేపీతో కలిసి మత ఛాందసవాదాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యాపింపజేస్తోందని ఈ సందర్భంగా ఆరోపించాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆరెస్సెస్ బీహార్ లో వ్యాప్తి చెందనివ్వబోనని ఈ సందర్భంగా తేజస్వి ప్రతిన బూనాడు.
ఆర్ఎస్ఎస్ విభజన వాదంతో దేశంలో చిచ్చురేపుతోందని...బహిరంగ ప్రదేశాల్లోనూ, వ్యక్తిగతంగానూ పరుష పదజాలం ఉపయోగిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని, అలాంటి వాటికి చెక్ చెప్పేందుకు తన సోదరుడు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తో కలిసి తాను ఈ విభాగాన్ని రూపొందించామని అన్నారు. తమ విభాగం సాయంతో ఆరెస్సెస్ అఘాయిత్యాలను అడుగడుగునా అడ్డుకుంటామని స్పష్టం చేశాడు.
కాషాయ పార్టీ(బీజేపీని ఉద్దేశించి) నుంచి, ఆ పార్టీలోని సంకుచిత మనస్తత్వంగల నేతల నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాకుండా ఇంకా గొప్పగా ఏమీ ఆశించలేమన్నాడు. ప్రశాంతంగా అన్నదమ్ముల్లా ఉన్న దేశ ప్రజల్లో చీలికటు తేవటమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. కేవలం హిందువులకు మాత్రమే మద్దతిస్తుందని, అలాగే ఇతర మతాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినప్పుడు అస్సలు సహకరించవని తెలిపాడు. ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా దానిని నిలువరించేందుకు డీఎస్ఎస్ ఏర్పాటు చేసినట్లు ఖరాఖండి ప్రకటన చేశారు ఆ ఇద్దరు సోదరులు.
వాళ్లిద్దరు దొంగలు: మోదీ
బీహార్ మాజీ ముఖ్యంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు తనయులు దొంగల ముఠా అని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోదీ తీవ్ర విమర్శలు చేశాడు. వాళ్లిద్దరూ(తేజస్వి, తేజ్ ప్రతాప్) అక్రమంగా కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నారు. పాట్నాలో పెట్రోల్ బంకు పేరుతో చేసిన స్కాంకి సంబంధించి పత్రాలను మీడియా ముందు ప్రవేశపెట్టాడు. భూములు లేకుండా పెట్రోల్ పంపులను ఎలా కేటాయిస్తారని మండిపడ్డాడు. కొడుకుల అక్రమాలకు తండ్రి వత్తాసు పలుకుతున్నాడు కూడా అంటూ మోదీ ఫైర్ అయ్యాడు. కాగా, అవినీతి ఆరోపణలపై ప్రశ్నించిన సందర్భంలో తన కొడుకులు పేదరికంలో చనిపోవటం ఇష్టం లేదని ఇంతకు ముందు స్వయంగా లాలూనే ఓ స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more