తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మరో టర్న్ తీసుకుంది. ఇప్పటికే తీవ్ర పదజాలంతో ఇరు పార్టీల నేతలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ నేత, తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన ఓ పనితో తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణ పోలీసులపై చేసిన ట్వీట్ తో తీవ్ర దుమారం రేగుతోంది.
తెలంగాణ పోలీసులు నకిలీ ఐఎస్ఐఎస్ వెబ్ సైట్ తయారుచేసి యువతను రెచ్చగొడుతున్నారన్న ఆయన ఆపై మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ కంటిన్యూ చేశాడు. ‘‘యువతను రెచ్చగొట్టాలని పోలీసులకు సీఎం కేసీఆర్ అధికారం ఇచ్చాడా?. అలా అయితే దానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’ అంటూ దిగ్విజయ్ వాటిల్లో పేర్కొన్నాడు.
దీనిపై వెంటనే రియాక్ట్ అయిన కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని, తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, అలాకానీ పక్షంలో చేసిన వ్యాఖ్యలకు తగిన ఆధారాలు చూపాలని కేటీఆర్ తెలిపాడు. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న నేతగా దిగ్విజయ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోపాటు, రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీశాయి.
I agree but what about the Telangana Police which is posting inflammatory postings to radicalise Muslim Youth through their fake ISIS site?
— digvijaya singh (@digvijaya_28) May 1, 2017
Most irresponsible & reprehensible thing coming from a former CM. Request you to withdraw these comments unconditionally or provide evidence https://t.co/cg7p7Ym48X
— KTR (@KTRTRS) May 1, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more