నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు వుంది అక్కడి పోలీసుల నిర్వాకం. పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటం ఎరుగని కరుణామాయులే అన్న పాటను పాడి వుండరు.. కనీసం వినివుండరు. అందుకనే రెండేళ్ల చిన్నారిపై కేసు పెట్టారు. రెండేళ్ల బుడతడిని చూస్తే ఎవరికైనా చాక్లెటో, బిస్కెట్లో ఇవ్వాలనిపిస్తుంది. కానీ ఇక్కడి పోలీసులకు మాత్రం ముద్దుగా వున్న బుజ్జాయిపై కేసు పెట్టాలనిపించింది.
తల్లి ఒడిలో ఒలాలాడుతున్న పసివాడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ మీ అబ్బాయిమీద ఎప్ ఐఆర్ నమోడైంది. వెంటనే వచ్చి లొంగిపోమనండీ అంటూ అక్కడి పోలీసులు ఫోన్ చేయడంతో ఎవరో తెలిసినవాళ్ల పనేనని.. ఆటపట్టించేందుకు ఇలా చేస్తున్నారమోనని లైట్ గా తీసుకున్నారు. కానీ అది నిజమైన పోలీసుల నుంచే వచ్చిందని తెలుసుకుని గుండెలు బాదుకున్నారు. సరిగ్గా మాటలు కూడా రానీ పిల్లాడిపై మీద అలాంటి కేసులు నమోదు చేయడంతో నెట్ జనులు కూడా పోలీసుల వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నారు.
బిహార్ లోని చంపారన్ జిల్లా పతాహి పోలీసు స్టేషన్ లో ఒక వింత ఫిర్యాదు నమోదైంది. బేలా బైజూ గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ గత నెల 15న కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల బాలుడు తనను లైంగికంగా వేధించి, తన బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడని 35 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. అయితే రెండేళ్ల బాలుడు లైంగిక వేధింపులకు దిగాడన్న దానిపై అంతా విస్తుపోతున్నారు.
రెండేళ్ల దళిత చిన్నారిపై ఇలాంటి కేసులు నమోదు చేయడంతో బీహార్ పోలీసులపై అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. పిర్యాదు చేసినవారు ఎలా చేసినా.. దానిని గుడ్డిగా నమోదు చేసి ఎప్ ఐఆర్ నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు తీరును అటు ఉన్నతాధికారులు కూడా అక్షేపిస్తున్నారు. రెండేళ్ల చిన్నారిపై దొంగతనం, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడమేంటని నిలదీస్తున్నారు. అయితే పిర్యాదు చేసిన మహిళ భర్త ఎస్సీ ఎస్టీ అక్ట్రాసిటీ కేసులో దోషని, అయన చేసిన దాడిలో తమ తండ్రి తలకు తీవ్రగాయాలయ్యాని బాలుడి తండ్రి తెలిపాడు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో మరో నిందితుడిగా వున్న గ్రామ పెద్ద సునీల్ కుమార్ తో కలసి సదరు మహిళ తమ బిడ్డపై దొంగతనం, లైంగిక వేధింపుల కేసు పెట్టందిని, దాని విచారణలో భాగంగా సిఐ కన్హయ్య ప్రపాద్ తన బిడ్డపై కేసు పెట్టి తనను వారిపై పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాడని తెలిపాడు. ఏకంగా మోతిహరి న్యాయస్థానం ఆవరణలోనే తనను కేసును ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా తెలిపాడు. కాగా ఈ విషయాన్ని ఏఎస్పీ విజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా గ్రామపెద్దతో పాటు తన కుమారుడిపై కేసు పెట్టిన మహిళపై కేసు నమోదు చేయాలని అదేశించినా.. వారు ఇంకా స్వేచ్చగా సంచరిస్తున్నారని బాధిత బాలుడి తండ్రి తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more