దెయ్యాలు, దేవుడు ఉన్నాయా? అన్న విషయం పక్కనపెట్టి ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవటం లాంటి ఘటనలు బోలెడు చూసి ఉంటాం. కానీ, ఇక్కడో వ్యక్తి మాత్రం నిస్వార్థంగా ఆత్మలను వారి బంధువులతో కాంటాక్ట్ చేయిస్తున్నాడు. ఇంతకీ వాటితో ఎలా కమ్యూనికేట్ చేయిస్తున్నాడన్నదే గా మీ అనుమానం. అందుకోసం ప్రత్యేకంగా ఓ టెలిఫోన్ బూతును కూడా ఏర్పాటు చేశాడు.
జపాన్ లోని ఓట్సుచి నగరంలో ఓ టెలిఫోన్ బూత్ ఉంది. అందమైన గార్డెన్ చుట్టూ గ్లాస్ ఫిట్టింగ్ తో లోపల ఓ ఫోన్ తో ఇది ఉంటుంది. దీని ద్వారా చనిపోయిన తమ బంధువులతో మాట్లాడేందుకు వీలు ఉందంట. ఇంతకీ దీనిని ఏర్పాటు చేసిన వ్యక్తి పేరు ఇటారు ససాకి. 2011లో సునామీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సునామీ ధాటికి ఓట్సుచి పట్టణంలో 16 వేల మందికి పైగా స్థానికులు మృతి చెందారు. అందులో ఇటారు సోదరుడు కూడా ఉన్నాడంట. నిజానికి అతని కోసమే ఇలా ఓ ఫోన్ బూత్ ను ఏర్పాటు చేసుకుని మాట్లాడటం ప్రారంభించాడు. అయితే తన లాగే తమ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులను కోల్పోయిన ప్రజలు తీవ్ర విషాదంలో ఉంటారు కాబట్టి వారి కోసం కూడా అలాంటిదే ఏదైనా చేయాలన్న ఆలోచనతో దీనిని డెవలప్ చేశాడు.
చనిపోయిన వారితో మాట్లాడేందుకు చాటింపు వేయించాడు. అంతే ఇప్పటిదాకా మొత్తం 10 వేలకు పైగా కస్టమర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటుండడం విశేషం. చనిపోయిన తమవారికి తమ సంగతులు చెప్పుకుంటున్నట్లు భావిస్తూ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. గాలి ద్వారా ఈ సందేశాలు వారి ఆత్మలకు చేరతాయన్న ఓ నమ్మకమే వారితో ఇలా చేయిస్తుందన్న మాట. కొందరు ప్రతీ రోజూ ఈ బూతుకు వస్తుంటే, మరికొందరు ఎప్పుడో ఒకసారి వస్తుంటారంట. తాను మాత్రం ఉదయం దానిని క్లీన్ చేసేందుకు మాత్రమే వెళ్తున్నానని ఇటారు చెబుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more