తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునే ప్రయత్నంలో విశ్వప్రయత్నాలు చేస్తూ దూకుడు పెంచి మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఇప్పటికే అమ్మ సెంటిమెంట్ తో ఎమ్మెల్యేల వద్ద కన్నీటితో మద్ధతు కోరిన శశికళ తాజాగా మరోసారి గోల్డెన్ బే రిసార్టుకు బయలుదేరింది. ఎవరు అడ్డుకున్నా తనను సీఎం కావటం ఆపలేరంటూ ప్రకటన కూడా చేసేసింది. ఇప్పటికే ఆమె రెండు సార్లు అక్కడకు వెళ్లి తమ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు హైకోర్టుకు పోలీసులు సమర్పించిన నివేదికలో ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగానే అక్కడ ఉన్నామంటూ చెప్పటంతో పన్నీర్ సెల్వం శిబిరంలో కలవరపాటు మొదలైంది. ఈ నేపథ్యంలో పోయెస్ గార్డెన్లోని తన నివాసంలో తమ పార్టీ నేతలతో చర్చించిన అనంతరం ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మరో 24 గంటల్లో ప్రభుత్వ ఏర్పాటు అనుమతించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అన్నాడీఎంకే నేతలు తాము శాంతియుత నిరసన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ అంశంపై చర్చించడానికే శశికళ గోల్డెన్ బే రిసార్టుకి బయలుదేరినట్లు తెలుస్తోంది. మొదట రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిన ఆమె ఇప్పుడు నేరుగా చర్చించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు.
కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు తమ వెంట ఉన్నా... బల నిరూపణకు గవర్నర్ తమను ఆహ్వానించకపోవడం పట్ల శశికళ వర్గం గుర్రుగా ఉంది. గవర్నర్ విద్యాసాగర్ రావుకు లేఖలు రాస్తున్నా... సమాధానం రాకపోవడంతో, వారిలో సహనం చచ్చిపోతోంది. దీని వెనుక బీజేపీ, డీఎంకేల కుట్ర దాగుందని శశికళ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను వెంటనే ఆహ్వానించేలా గవర్నర్ కు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ శశి వర్గీయులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 24 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో వారు కోరారు.
ఇక తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ భేటీ అయ్యాడు. ఈ మధ్యాహ్నం స్టాలిన్ సెక్రటేరియట్ కు వెళ్లి, అక్కడ కాసేపు గడిపి వచ్చారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత పన్నీర్ సెల్వం సచివాలయానికి చేరుకున్నారు. దీంతో, ఇద్దరూ కలిసే అవకాశం కుదరలేదు. ఈ నేపథ్యంలో, కాసేపటి క్రితం కలుసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వమే కొనసాగాలని స్టాలిన్ కోరుతున్నారు. శశికళ ముఖ్యమంత్రి అయితే ఆమె బలపడుతుందనే అనుమానాలు స్టాలిన్ కు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, పన్నీర్ కు మద్దతు పలికేందుకు స్టాలిన్ సంసిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీంతో శశి వర్గం నుంచి కొంత మంది ఎమ్మెల్యేలనయినా పన్నీర్ లాగాల్సిన పరిస్థితి నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more