మహిళా సాధికారత-ప్రజాస్వామ్యానికి బలం పేరిట మూడు రోజుల పాటు జరగనున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆడంబరంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బౌద్ధ గురువు దలైలామా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, పాండిచ్చేరి గవర్నర్ కిరణ్బేడీ, ఏపీ సీఎం చంద్రబాబు, మనీషా కోయిరాల, పలువురు దేశవిదేశాల నుంచి వచ్చిన 1200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మూడు రోజులపాటు ఐదు ప్లీనరీ సెషన్లు నిర్వహించనున్నారు. వంద మహిళా కళాశాలలకు ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయటం విశేషం.
ముందుగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రసంగ ఉపన్యాసం చేస్తూ... మహిళల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువని, అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో మహిళలు ముందున్నారని తెలిపాడు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ... మహిళలను గౌరవించినప్పుడే ఏ సమాజమైనా ప్రగతిపథంలో పయనిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా హక్కులను కల్పించేందుకు తమ నాయకుడు ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, చట్టం వచ్చేలా చేశారని తెలిపాడు. మహిళల విద్యకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించింది ఎన్టీఆరే అని, స్థానిక సంస్థల్లో మహిళలకు అవకాశాలు కల్పించింది కూడా ఆ మహానుభావుడేనంటూ కొనియాడాడు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలని కోరిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశమేనని, మహిళా రిజర్వేషన్లను సాధించేంత వరకు తమ పోరాటం ఆగదంటూ ప్రసంగించాడు. ఒక్క సాధికారతే కాకుండా, ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలు అడుగు వేయాలంటూ పిలుపునిచ్ాచడు. పనిలోపనిగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించాడు. భారత ప్రధానిగా ఆమె పోషించిన పాత్ర అసామాన్యమైనదని కొనియాడాడు. ఇక ఈ సదస్సు అమరావతిలో జరగడం చాలా ఆనందంగా ఉందని... దీనికి స్పీకర్ కోడెలను ప్రత్యేకంగా అభినందిస్తున్నన్నాడు. అనంతరం దలైలామా, వెంకయ్య నాయుడులు కూడా ప్రసంగించారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏపీ ప్రత్యేక హోదాకు మద్ధతు ప్రకటించటమే కాదు, సమావేశంలో సందడి చేస్తూ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది కూడా.
91 మంది మహిళా ఎంపీలు, 401 మంది లెజిస్లేటర్ లు, 300 మంది ఉద్యమ వేత్తలు దీనికి హాజరు అయ్యారు. కాగా, మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు ద్వారా మహిళలకు అధికారం అన్న అంశంతోపాటు, అన్ని రంగాల్లో మహిళలు ఎలా రాటుదేలాలన్న దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more