తన అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న కుమారుడు అఖిలేష్ యాదవ్ వ్యవహారంతో సతమతమవుతున్న ములాయం సింగ్ కి ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. సందు చిక్కినప్పుడుల్లా విరుచుకుపడుతున్న ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఏకంగా పరుష పదజాలానికే దిగారు. బీజేపీ ఎంపీ సంజీవ్ బాల్యన్ ఓ అడుగు ముందుకేసి ములాయం పై వ్యాఖ్యలు చేశాడు.
ములాయంకు మతపరమైన రాజకీయాలంటే పిచ్చి, ఇక ఆయన ఆటలు సాగవు. ములాయంకి రోజులు దగ్గరపడ్డాయంటూ ఘాటుగానే కామెంట్ చేశాడు. మధురలోని ఓ ర్యాలీలో పాల్గొన్న బాల్యన్ మాట్లాడుతూ ఎన్నికల తర్వాత అఖిలేశ్ యూపీ రాజకీయాల్లో కనిపించకుండా పోతాడంటూ తెలిపాడు. ఒకరు కేంద్రంలో దొపిడీ చేసిశారు, మరోవైపు అధికారం అండతో తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని దొచుకున్నారు. మరోసారి వాళ్లిద్దరికీ పవర్ చేతికొస్తే(ఎస్పీ-కాంగ్రెస్ పొత్తుపై) ఉన్నదంతా ఊడ్చుకుని పోతారంటూ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ తో పొత్తుపై ములాయం కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాడు. ఈ పొత్తు అనైతికమని, దాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోనని స్పష్టం చేస్తూ, తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనేది లేదని తెలిపారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉండి కూడా పొత్తులు ఎందుకని ఆయన ప్రశ్నించాడు. కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం కేంద్రం అధికారంలో ఉండి కూడా ఎలాంటి అభివృద్ధీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ - సమాజ్ వాదీ కూటమికి వ్యతిరేకంగా పనిచేయాలని కార్యకర్తలను కోరనున్నట్టు పేర్కొన్నారు. పార్టీ నేతలను అఖిలేష్ దూరం చేసుకుంటున్నారని చెప్పారు. మాజీ మంత్రి నారద్ రాయ్ బీఎస్పీలో చేరిన విషయాన్ని గుర్తు చేస్తూ, నేతలను దూరం చేసుకుంటే ఓటమే మిగులుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more