ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కన్నడ రాజకీయాలలో చెరగని ముద్ర వేసి, ఒకనాటి కాలంలో రాజకీయాలను శాశించిన కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ పార్టీకి గుడ్ బై చెబుతూ పార్టీ అధిష్టానికి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ వర్కింట్ కమిటీకి, పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. ఒకప్పుడు చక్రం తిప్పిన తనను ఇప్పుడు పార్టీ పట్టించుకోవడం లేదని అందచేత అవేదన చెంది తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.
పార్టీ కోసం నిబద్దతతో పనిచేసిన తనలాంటి కార్యకర్తను వయసు కారణంగా దూరం పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజుల్లో మాస్ నాయకులు అవసరం లేదని, మేనేజర్లు కావాలని ఎద్దేవా చేశారు. వయసు అనేది రాజకీయాలకు అడ్డంకి కాదని స్పష్టం చేశారు. బాధ, ఆందోళనతో పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు హైకమాండ్ తో చెప్పానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన ధ్రువీకరించారు.
1962లో కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎస్.ఎం.కృష్ణ ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1968 నుండి మండ్య జిల్లా నుండి పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1983 నుండి 1985వరకు అప్పటి ప్రధానమంత్రులైన ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీల కేబినెట్లో మంత్రిగా పదవులు లభించాయి. 1996, 2006 సంవత్సరాల్లో రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన ఆయన 1989 నుండి 1994 వరకు వీరప్పమొయిలీ నేతృత్వంలో డిప్యూటీ సీఎంగా, విధానసభ స్పీకర్గా పని చేశారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక సీఎంగా, 2004 నుంచి 2008 వరకు మహరాష్ట్ర గవర్నర్గా వ్యవహరించారు. 2009 నుండి 2012ల మధ్య అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్లో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more