ఆరు రోజులపాటు ప్రశాంతంగా జరిగిన జల్లికట్టు నిరసన ఒక్కసారిగా హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీటి వెనుక పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ హస్తం ఉందంటూ ఆయన ఆరోపిస్తున్నాడు. మొదట ఉద్యమాన్ని నడిపిన వారు ఇప్పుడు అందులో లేరని చెబుతున్న ఆయన, సంఘ విద్రోహశక్తులు చేరటంతోనే పరిస్థితి ఇలా మారిందంటూ అనుమానం వ్యక్తం చేశారు.
జల్లికట్టు కోసం తాను ముందు నుంచి పోరాడుతున్నానని, కాంగ్రెస్సే దానిని నిషేధించిందని ఆయన తెలిపారు. జల్లికట్టు పట్ల తాము ముందు నుంచి సానుభూతితో ఉన్నామని ఆయన చెప్పారు. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కావాలని ఉద్యమకారులంటున్నారని, అదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
కాగా, బీచ్ లో ఉన్న నిరసనకారులను ఖాళీ చేయించే క్రమంలో చెలరేగిన అల్లర్లు ఒక్కసారిగా నగరం మొత్తం, ఆపై రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెట్రోల్ బాంబులతో ఆందోళనకారులు తమపై దాడి చేస్తుంటే తిరిగి ప్రతిఘటిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రజనీ రిక్వెస్ట్...
చెన్నైలోని మెరీనా బీచ్ నుంచి ‘జల్లికట్టు’ ఉద్యమకారులను వెళ్లగొట్టేందుకు పోలీస్ చర్యలు చేపట్టడంతో పలు ప్రాంతాల్లో ఈ రోజు హింసాకాండ, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గతరాత్రి కాల్పులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక ట్వీట్ చేశారు. ‘జల్లికట్టు’ ఉద్యమకారులు తమ నిరసనలు, ఆందోళనలు విరమించాలని రజనీకాంత్ పిలుపు నిచ్చారు. ఆ విధంగా చేయకపోతే,ఈ ఉద్యమాన్ని అసాంఘికశక్తులు తమ చేతుల్లోకి తీసుకుంటాయని, దీంతో, ఉద్యమకారులకు చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉందని తన లెటర్ ప్యాడ్ పై తమిళ్ భాషలో రాసి, దానిని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
వైరల్ అవుతున్న వీడియో...
ఇదిలా ఉంటే కొన్ని ఛానెళ్లలో ప్రసారం అవుతున్న ఓ వీడియో సంచలనంగా మారింది. ఆందోళనకు అసలు కారణం నిరసనకారులు కాదని, పోలీసులే అంటూ అందులో ఉంది. ఓ పోలీస్ అధికారి ఆటోకు నిప్పు పెడుతున్న వీడియో హల్ చల్ చేస్తోంది. కమల్ హసన్, అరవింద స్వామి తదితరులు ఈ వీడియోను తమ ట్విట్టర్ లలో పోస్ట్ చేశారు. దీనిపై విచారణకు ఆదేశిస్తామని ఓ అధికారి తెలుపగా, మరో అధికారి మాత్రం అదంతా మార్ఫింగ్ అంటూ తేల్చేయటం కొసమెరుపు.
What is this. Please explain some one pic.twitter.com/MMpFXHSOVk
— Kamal Haasan (@ikamalhaasan) January 23, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more