తాగిన మైకంలో మృగంలా మారిన అతగాడు పిల్లల ముందే భార్యను కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా తన శాడిజంను చూపించాడు. భార్య రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటుంటే... ఆ దారుణం అంతా సెల్ ఫోన్ లో వీడియో తీశాడు.
వివరాల్లోకి వెళ్లితే.. నల్గొండ జిల్లాకు చెందిన సేనావతు రాజు చింతపల్లి మండలం రొట్టిగడ్డతండాలో జీవిస్తున్నాడు. పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా, వృత్తిరీత్యా రాజు బోర్ వెల్ వర్కర్ గా పనిచేస్తుండటంతో ఇంటికి వచ్చేది తక్కువే. ఈ క్రమంలోనే అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరుచూ భార్యతో గొడవపడుతుండేవాడు. సంక్రాంతి రోజు కూడా భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఎవరితో సంబంధం పెట్టుకున్నావో చెప్పాలంటూ భార్యను వేధించాడు.
అక్కడితో ఆగక, సుత్తితో భార్య చేతులు, భుజాలు, తలపై విపరీతంగా కొట్టాడు. తమ ఇద్దరు పిల్లలు చూస్తుండగానే కనీస కనికరం కూడా లేకుండా రాజు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అంతేకాదు, భార్య రక్తపు మడుగులో విలపిస్తుంటే.. ఆ ఉదంతాన్ని తన సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందాడు. సుత్తితో కొట్టడం వల్ల తీవ్ర గాయాలపాలైన రాజు భార్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం రాజు ఇంటి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి రాజును పట్టుకున్నారు. ఆపై అతని ఫోన్ లో వీడియో లభ్యం కావటమే కాదు, నేరాన్ని అంగీకరించటంతో ఆ కిరాతకుడిని రిమాండ్ కి తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more