భారత అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన క్షిపణ చేరిపోనుంది. ఖండాంతర క్షిపణి అగ్ని-5ను నేడు విజయవంతంగా పరీక్షించారు డీఆర్డీవో శాస్త్రవేత్తలు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దీన్ని విజయవంతంగా పరీక్షించారు. భారత్ దీనిని శాంతి ఆయుధంగా పేర్కొనటం విశేషం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్ మెంట్ ఆర్గజైజేషన్(డీఆర్డీవో) నాలుగు పరీక్షల తర్వాత పూర్తిస్థాయిలో పరీక్షించింది. ప్రధానంగా గైడెడ్, నావిగేషన్ వ్యవస్థలను నేటి పరీక్షలో విజయవంతంగా చేయగలిగారు. మరికొన్ని పరీక్షల అనంతరం భారత సైన్యం అమ్ములపొదిలోకి ఈ క్షిపణులు చేరుతాయి. అగ్ని-1 700 కిలోమీటర్లు, అగ్ని-2 2000 కిలోమీట్లరు, అగ్ని-3 మరియు అగ్ని-4 2500 నుంచి 3500 కిలోమీటర్ల లక్ష్యాలను నాశనం చేయగలవు. ఇక అగ్ని-5 ముఖ్య ఉద్దేశం ఏదైనప్పటికీ, ఇది వరకు ఇంత సుదూర క్షిపణిని తయారు చేసి పరీక్షించిన చైనా ఆటలకు చెక్ పెట్టేందుకే అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు..
అగ్ని-5 క్షిపణి ప్రత్యేకతలు ఇవే...
1. భారత్ 35 దేశాల మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ లో సభ్యత్వం పొందిన తర్వాత అగ్ని-5కు నిర్వహించిన తొలి పరీక్ష ఇది.
2. ఐదు వేల కిలోమీటర్లు, 1000 కేజీల వార్ హెడ్ ను ఈ మిసైల్ మోసుకుపోగలదు.
3. పాకిస్థాన్, చైనా, యూరోప్ లోని పలు ప్రాంతాలను ఈ క్షిపణి ఛేదించగలదు. అత్యాధునిక క్షిపణి వ్యవస్థకు చెందినది.
4. ఉపరితలం నుంచి ఉపరితలానికి దీన్ని ప్రయోగించగలం. అత్యాధునిక ఫైర్ అండ్ ఫర్గెట్ వ్యవస్థ ఉండటంతో... శత్రు వ్యవస్థలు దీని ఆగమనాన్ని పసిగట్టడం చాలా కష్టం.
5. అగ్ని-6 క్షిపణి ప్రాజెక్టు ప్రాథమిక దశలో ఉంది. దీని రేంజ్ 8వేల నుంచి 10 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. సబ్ మెరైన్ల నుంచి కూడా దీన్ని ప్రయోగించేలా సిద్ధం చేస్తున్నారు.
6. 17 మీటర్ల పొడవుంటే ఈ మిస్సైల్ 50 టన్నుల అత్యాధునిక ఆయుధాలను మోసుకెళ్లగలదు.
ఇదిలా ఉంటే త్వరలో అగ్ని-6 తో 8000 నుంచి 10000 కిలో మీటర్ల లక్ష్యాలను నాశనం చేయగల క్షిపణిని రూపొందించేందుకు రక్షణ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more