ట్రయల్ రన్ లోనే మెట్రో రైలుకు ప్రమాదం | metro trains collide in trial run

Metro trains collide in trial run

Hyderabad Metro, Delhi Metro accident, Metro Collide, Metro trial run, Accident in Metro trial Run, Metro Train accident, Hyderabad Metro safety

metro trains collide in trial run in Delhi.

మెట్రో రైలు ట్రయల్ రన్ లో ప్రమాదం

Posted: 11/05/2016 03:53 PM IST
Metro trains collide in trial run

ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా రెండు రైళ్లు ఢీ కొట్టిన ఘటన నగరంలో కలకలం రేపింది. డ్రైవర్ లెస్ రైళ్లు రెండు ఢీ కొట్టుకోవటంతో ఈ ఘటన జరిగింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్ ప్రాజెక్టులో ఊహించని ప్రమాదం జరిగింది. శుక్రవారం జానకీపురి-బొటానికల్ గార్డెన్ లైన్ వద్ద నిర్వహించిన ట్రయల్ రన్లో రెండు రైళ్లు కాలింది కుంజ్ స్టేషన్ వద్ద ఒకే ట్రాక్పై వచ్చి ఢీకొన్నాయి.

డ్రైవర్ రహిత రైళ్లను నడపడానికి ఢిల్లీ మెట్రో ప్రత్యేకంగా మెజెంటా లైన్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇది 2017 ఏడాది మధ్యలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. జానక్పురి వెస్ట్, బొటానికల్ గార్డెన్ మధ్య 25 స్టేషన్లను కలుపుతూ కొత్త కారిడార్ను నిర్మిస్తున్నారు. మెట్రో అధికారులు ఇటీవల ఈ లైన్పై విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే నిన్న ఇదే లైన్పై నిర్వహించిన ట్రయల్ రన్లో ఒకేసారి రెండు రైళ్లు ఢీకొన్నాయి.

ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సిగ్నల్ వ్యవస్థలో లోపం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ మధ్యే జహంగీర్ పూరి-హుడా సిటీ సెంట్రల్ లైన్ మధ్య ఓ రైలు డోర్ తెరుచుకునే వెళ్లిన ఘటన తెలిసిందే. దీంతో టోటల్ గా మెట్రో రైల్ వ్యవస్థపైనే మొత్తంగా కంగారు నెలకొంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Metro trains collided  Delhi  

Other Articles