అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి... సొంత పార్టీ అని కూడా చూడకుండా సంచలన వ్యాఖ్యలు చేయటం ఆయన నైజం. ప్రత్యేక హోదా దగ్గరి నుంచి పాలనపరంగా దేన్ని వదలకుండా చాలా విషయాల్లో విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి సంచలన పనితో వార్తల్లో నిలిచాడు. గన్నవరం విమానాశ్రయంలో హల్ చల్ చేసిన ఈ అధికార పార్టీ ఎంపీ ఫర్నీఛర్ ధ్వంసం చేయబోయారన్న వార్తలు చానెళ్లలో ప్రముఖంగా ప్రసారం అవుతున్నాయి.
విషయం ఏంటంటే... శుక్రవారం అమరావతి పరిపాలన నగరం కార్యక్రమం పూర్తియిన తర్వాత ఢిల్లీకి వెళ్లేందుకు ఆయన ఎయిపోర్ట్ కు వచ్చారు. ఎయిర్ ఇండియా విమానంలో ఆయన న్యూఢిల్లీ వెళ్లవలసి ఉంది. ఆయన వచ్చేసరికి ఆ విమానం వెళ్లిపోయింది. దీంతో ఆయన కోపం కట్టలు తెంచుకుంది. తాను వస్తున్నానని చెప్పినా విమానం నిలపకపోవడంపై ఆయన ఉగ్రతాండవమే చేశారంట.
సాయంత్రం 4.45 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా గన్నవరం చేరుకుంది. అందులో ప్రయాణించేందుకు జేసీ 5.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే విమానం బోర్డింగ్ పూర్తి చేసుకుందని మేనేజరు చెప్పాడు. అయితే విమానం ఇంకా బయలుదేరలేదు కదా.. అవకాశం కల్పించాలని జేసీ కోరాడు. పైలెట్ ఒక్కసారి డోర్ క్లోజ్ చేసిన తర్వాత తీయటం అసాధ్యమన్నారు. పైగా మీ ప్రయాణం లేదని ప్రోటోకాల్ వారు చెప్పటంతోనే బోర్డింగ్ ముగించినట్లు చెప్పాడు. దీంతో ఎంపీ అయిన నాకే బోర్డింగ్ క్లోజ్ అని చెబుతారా? అంటూ జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనదైన శైలిలో తిట్లపురాణం అందుకున్నారు. చివరకు ఎయిర్ ఇండియా కార్యాలయంలోకి దూసుకెళ్లి అక్కడున్న కంప్యూటర్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతం అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్పోర్టు లాంజ్రూమ్లో ఉండగానే జరగడం గమనార్హం. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని అక్కడకు చేరుకుని ఎంపీ జేసీని సముదాయించటంతో శాంతించారంట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more