అంతుచిక్కని ఆ రహస్యాన్ని ఎట్టకేలకు శాస్త్రవేత్తలు ఛేదించారు. వందల సంవత్సరాలుగా ఆ సముద్ర ప్రాంతంలో ప్రయాణిస్తున్న నౌకలు, విమానాలు హఠాత్తుగా మాయం అయిపోతుండటం, దానికి కారణం కనుక్కోలేక బుర్ర గొక్కుంటున్న వారికి అసలు విషయం తెలిసిపోయింది. బెర్ముడా ట్రయాంగిల్ అంటూ దశాబ్దాలుగా కొనసాగుతున్న మిస్టరీ ఎట్టకేలకు వీడింది.
బెర్ముడా, ఫ్లోరిడా, పుర్టో రికా మూడింటికి మధ్యలో సమీద్ర తీరంలో ఓ ప్రాంతం ఉంది. అక్కడికి రాగానే నౌకలు, విమానాలు మాయమవుతూ ఉంటాయి. ఇది ఇప్పటిదేం కాదు. శతాబ్దాల నాటిది. అంతుచిక్కని ఈ రహస్యానికి చేధించేందుకు చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. 1950లో ఎడ్వర్డ్ అనే శాస్త్రవేత్త ఈ విషయం గురించి ఓ వ్యాసం రాశాడు. దీంతో అందరిలో ఆసక్తి మొదలైంది.
అది ఏలియన్ల పని అని కొందరు, కాదు కాదు... బలమైన అలల ప్రబావంతోనే అని కొందరు వాదించారు. అయితే విమానాలు, నౌకలు మాయమైతే ప్రపంచానికి తెలీకుండా ఉంటుందా? అదంతా ఉత్తదేనని మరికొందరు దానిని కొట్టిపారేశారు. కానీ, వందల సంఖ్యలో చిన్న చిన్న పడవలు, తేలికపాటి ఫ్లైట్లు పదుల సంఖ్యలో మాయం కావటం నిజమేనని తీర ప్రాంత ప్రజలు, అధికారులు ఆ తర్వాత అధికారికంగా ప్రకటించారు. దీంతో బెర్ముడా ట్రయాంగిల్ పై ఓ సస్పెన్స్ నెలకొంది.
చాలా మంది మేధావులు రకరకాల అభిప్రాయాలను వెల్లడించారు. కానీ, శాస్త్రీయంగా ఒక్కరూ నిరూపించలేకపోయారు. చివరికి స్టీవ్ మిల్లర్ అనే ఉపగ్రహా అధ్యయకుడు అక్కడి మేఘాల వల్లే ఇదంతా జరుగుతుందని నిరూపించాడు. షడ్భుజాకార మేఘాలే ఈ మిస్టరీకి కారణమంటూ చెబుతున్నాడు. గంటకు 273 కిలోమీటర్ల వేగంతో కదిలే ఆ ప్రాంతలోని మేఘాలు ఎయిర్ బాంబ్స్తో అనుసంధానమై ఉన్నాయని, వాటి వల్ల బెర్ముడా ట్రయాంగిల్ వద్ద పెను తుపాను వంటి గాలి తీవ్రత ఏర్పడడం వల్ల విమానాలు, నౌకలు నీటిలో మునిగిపోతున్నాయని తెలిపాడు.
ఎగ్జాగోనల్ మేఘాలు గంటకు 106 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను వదులుతుంటాయి. వాటి మూలంగానే అవి ప్రమాదానికి గురౌతున్నాయి. ఈ విషయాన్ని రాడార్ శాటిలైట్ ఇమేజరీని ఉపయోగించి ఈ విషయాన్ని కనుగొన్నట్టు ర్యాండీ అనే సహా శాస్త్రవేత్త వివరించాడు. దీంతో నాసా కూడా కనిపెట్టలేకపోయిన వందల ఏళ్ల నాటి ప్రశ్నకు సమాధానం దొరికినట్లయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more