సీనియర్ అధికారి బీకె బన్సాల్ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్. అవినీతి కేసులో విచారణ సందర్భంగా బన్సాల్, ఆయన కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు వేధించారంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. గతంలో ఆయనను అరెస్ట్ చేసినప్పుడు భార్య, కూతురు ఆత్మహత్య చేసుకోగా, తాజాగా సెప్టెంబర్ 27న బన్సాల్ మరియు ఆయన కుమారుడు యోగేష్ లు చనిపోయారు.
కాగా, కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవటంతో షాక్ కి గురైన సీబీఐకి, వారిని వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు కూడా చుట్టుముట్టాయి. అయితే కోటి రూపాయల అప్పు చెల్లించలేకే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ పేర్కొంటున్న సీబీఐ, తమలో కొందరు కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారన్న వాదనను మాత్రం సమర్థించింది.
కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వశాఖలో డైరక్టర్ జనరల్ గా విధులు నిర్వహించిన 59 ఏళ్ల బన్సాల్ లంచం ఆరోపణలతో అరెస్టయి సీబీఐ విచారణను ఎదుర్కున్నారు. జూలైలో ఓ ఫార్మా కంపెనీ నుంచి రూ.9 లక్షలు లంచం తీసుకుంటుండగా పోలీసులకు బన్సాల్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. బన్సాల్ను అదుపులోకి తీసుకొని అతడి ఇంట్లో సోదాలు చేయగా రూ.60 లక్షల నగదు, 20 ఆస్తుల పత్రాలు, 60 బ్యాంక్ ఖాతాల వివరాలు లభించాయి. ఆ అరెస్ట్ ను అవమానంగా భావించి ఆ మరుసటి రోజే, భార్య కుమార్తె సూసైడ్ చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఇప్పుడు బన్సాల్, కొడుకు యోగేష్ లు డిప్రెషన్ తో తనువు చాలించారు.
కాగా, చనిపోయే సమయంలో బన్సాల్ ఐదుగురు సీబీఐ ఆఫీసర్ల పేర్లను లేఖలో పేర్కొనటమేకాదు, ఇంట్లో ఆడవాళ్లను చెప్పుకోలేని భాషలో దూషించారంటూ తెలిపారు. అంతేకాదు ఓ ఇద్దరు అధికారులు కేసు నుంచి పక్కదారి పట్టించేందుకు డబ్బు లంచంగా కోరారని, తమను అన్ని రకాలుగాఇబ్బందులకు గురిచేయటం మూలంగానే చనిపోతున్నామని రాసి ఉంది.
అయితే సీబీఐ మాత్రం ఆ కుటుంబంపై ఉన్న అవినీతి ఆరోపణలను సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు సిద్ధమైపోతుంది. బన్సాల్ అరెస్టయిన మరుసటి రోజు ఆయన కుమారుడు, మరియు భార్య బ్యాంకు లాకర్ల నుంచి డబ్బును డ్రా చేయటం(30 బ్యాంకు లాకర్లు), సీపీ పుటేజీలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు విచారణ చేపట్టిన ఆర్పీ అగర్వాల్ నేతృత్వంలోని సీబీఐ బృందం అన్ని కసరత్తులు సిద్ధం చేసింది.
మరోవైపు బన్సాల్ కుటుంబం ఆత్మహత్య కేసులో ఢిల్లీ మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు నోటీసు పంపింది. బన్సాల్ రాసిన ఆత్మహత్య నోట్ లో పేర్కొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా తెలియజేయాలని ఆ నోటీసులో పేర్కొంది. దీనిపై 48 గంటలలోగా స్పందించాలని డీసీడబ్ల్యు ఆ నోటీసులో ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more