యూరీ సెక్టార్ లో ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వీరజవానుల కుటుంబాలకు అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయి. 2 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు ఎదుర్కోగా, తాజాగా మరో నేత వ్యవహారంపై అంతా మండిపడుతున్నారు. బీజేపీ ఎంపీ చేసిన నిర్వాకంపై గ్రామస్థులే ఆగ్రహాం వ్యక్తం చేయగా, ఆ అమరుడి కుటుంబాన్ని తీవ్ర ఆవేదనకు గురైంది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన జవాను గణేశ్ శంకర్ యాదవ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో గణేశ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన గురాపలిలో సైనిక లాంఛనాల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా హాజరైన బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి వీరజవాను మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం వీరజవాను అంత్యక్రియలకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... గణేశ్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతటితో ఆగని ఆయన ఎవరికి తోచినంత సాయం వారు చేయాలని హాజరైన వారిని కోరారు.
దీంతో పలువురు డబ్బులిచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే అప్పటికే పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన అమరజవాను కుటుంబ సభ్యులను ఇది తీవ్రంగా బాధించింది. దీనిని అవమానంగా భావించిన అమర జవాను భార్య గడియా తామేమీ బిచ్చగాళ్లం కాదని మండిపడింది. సైనిక లాంఛనాలు, ఇతర సౌకర్యాలు ఉండగా, చందాలు వసూలు చేయడమేంటని, దయచేసి డబ్బులిచ్చి అవమానించవద్దని ఆమె ఆయనకు స్పష్టం చేశారు. ఆ హఠాత్ పరిణామంతో బిత్తరపోయిన సదరు బీజేపీ ఎంపీ తన అనుచరులతో అక్కడి నుంచి నిష్క్రమించారు.
కాగా, దీనిపై పలువురు స్థానికులు మండిపడుతున్నారు. ఎంపీగా సాయం చేయాల్సిన ఆయన అక్కడున్న వారి నుంచి చందాలు వసూలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలపై స్పందించిన త్రిపాఠి ఆ కుటుంబాన్ని అవమానించడం తన ఉద్దేశం కాదని, వారికి సాయం చేయాలని మాత్రమే చూశానని వివరణ ఇచ్చుకున్న అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more