హైదరాబాద్ మరోసారి భారీ వర్షంతో అతలాకుతలం అయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి మొదలైన కుండపోతతో నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు రోడ్లు డ్యామేజ్ కాగా, తాజా వానలతో వాహనాదారులు ఆపసోపాలు పడుతున్నారు. కాగా, కొన్ని ఏరియాల్లో వర్ష భీభత్సం కొనసాగుతూనే ఉంది.
గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, చందానగర్, నాంపల్లి, కూకట్ పల్లి, పంజాగుట్ట, అబిడ్స్, అమీర్ పేట్, ఎర్రగడ్డల్లో వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. పంజాగుట్టలో నిలిచిన నీటితో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జూబ్లీహిల్స్ లో వాహన రాకపోకలు నత్త నడకన సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోవటం విశేషం.