ఐకానిక్ ఫోటోగా ఫేరుగాంచిన నాపలమ్ అటాక్ నగ్న బాలికను ఇకపై షేర్ చేసేందుకు వీలుగా ఫేస్ బుక్ నిర్ణయం వెలువరించింది. 1972లో వియత్నాంలో జరిగిన రసాయనిక దాడి(నాపలమ్ ఎటాక్) జరిగింది. ఇందులో నలుగురు చనిపోగా, నుంచి తప్పించుకునేందుకు ఏడుస్తూ నగ్నంగా రోడ్డుపై పరిగెడుతున్న చిన్నారి ఫొటో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. శతాబ్దాల నాటి ఈ ఫోటోను ఫేస్బుక్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. పులిట్జర్ బహుమతి గెలుచుకున్న ఈ ఫొటోను నార్వేకు చెందిన అసోసియేటెడ్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ నిక్ యుట్ తీశారు. దీనిని ఆయన తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
అయితే నియమ నిబంధనలకు ఈ ఫొటో విరుద్ధంగా ఉందంటూ ఫేస్బుక్ దీనిని తొలగించింది. శుక్రవారం నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్గ్ ఈ ఫొటోను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా దానిని కూడా ఫేస్బుక్ తొలగించింది. దీంతో ఫేస్బుక్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. చరిత్రను కళ్లకు కట్టిన ఈ ఫొటోను ఫేస్బుక్ తొలగించడంపై పలువురు మండిపడ్డారు. విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన ఫేస్బుక్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. దీంతో ఫేస్బుక్ యాజమాన్యం తన నిర్ణయాన్ని మార్చుకుని చిన్నారి ఫొటోను షేర్ చేసుకునేందుకు కూడా అనుమతిస్తున్నట్టు పేర్కొంది.
చరిత్రను పరిశీలించి, విశ్వవ్యాప్తంగా ఈ ఫొటోకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించినట్టు తెలిపింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న గొప్ప ఛాయాచిత్రమని కొనియాడింది. ఫొటోను తొలగించిన చోటే తిరిగి దానిని పోస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. ఫేస్బుక్ తన నిర్ణయాన్ని మార్చుకున్నందుకు నార్వే ప్రధాని సోల్బెర్గ్ సంతోషం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more