పెను వివాదంగా మారిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ అంశం పూర్తిగా తెరమరుగు కానుంది. ప్రతిపక్షాలు, విపక్షాలు, ప్రజా సంఘాలు ఎన్ని కలిసి నానారాద్ధాంతం చేసినా సరే ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు వ్యూహం ముందు అవేమీ నిలబడలేకపోతున్నాయి. గత కొన్ని రోజులుగా అటు రైతుల నుంచే కాకుండా ఇటు రాజకీయంగా కూడా దీనిపై భారీ వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. నిపుణులు వద్దని వారిస్తున్న సరే మొండిపట్టుతో టీ సర్కార్ ముందుకు వెళ్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు.
అయితే ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టు కావటంతో జపాన్ పర్యటనను రద్దు చేసుకుని మరీ హరీశ్ రావు నేరుగా కార్యరంగంలోకి దిగిపోయారు. ఈ క్రమంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ఆయన అడుగుపెట్టారు. స్వయంగా గ్రామాలకు వచ్చి ప్రాజెక్టు ఆవశ్యకత, భూములిస్తే దక్కనున్న లబ్ధిపై హరీశ్ వివరించడంతో రైతులు ఆందోళన బాటను విడనాడారు. ఇప్పటికే భూసేకరణకు మెజారిటీ గ్రామాల రైతులను ఒప్పించగలిగిన ఆయన నిన్న సింగారం గ్రామంలోనూ సానుకూల ఫలితాలను సాధించారు.
మీడియా సహకారంతో అనుమానాలను నివృత్తి చేయటంతోపాటు, ప్రతిపక్షాలు హైలెట్ చేసిన గ్రామాల్లోనే ప్రాజెక్టు కోసం భూములిచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా కృషి చేశారు. ఒక్క వేములఘాట్ గ్రామ రైతులు మాత్రమే ఈ విషయంలో కాస్త వ్యతిరేకత చూపిస్తున్నప్పటికీ ఈ రెండు మూడు రోజుల్లో వారితోనూ కూడా హారీష్ రావు భేటీ అయ్యేందుకు సిద్ధమౌతున్నారు. ఈ వ్యవహారంలో ఆయన స్థానంలో వేరోకరు ఉండి ఉంటే సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారం అయి ఉండేది కాదన్నది వాదన వినిపిస్తోంది. మొత్తానికి రాజకీయ ప్రకంపనలు పుట్టించిన మల్లన్నసాగర్ నిర్వాసితుల మ్యాటర్ రోజుల వ్యవధిలోనే తెర మరుగు కానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more