త్వరలో పెద్దన్న పాత్ర నుంచి ఒబామా తప్పుకోనున్నాడు. ఇన్నాళ్లూ అమెరికా అధ్యక్షుడిగా ఒక నల్ల జాతీయుడై ఉండి జాతి వివక్ష అంశాన్ని వివాదాస్పదం చేయకుండా ప్రజల మధ్య ఐక్యత కోసం, ఇతర దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. ఇక చివరి రోజుల్లో ప్రజల్లో కలిసిపోతూ తన మనోభావాలను వారి ముందు ఉంచుతున్నాడు.
ఈ క్రమంలో అధ్యక్షుడి హోదాలో వైట్ హౌస్ లో జరిగిన మహిళా సదస్సులో లింగ అసమానతలు గురించి ఉపన్యసించాడు. ఈ సందర్బంగా తన పెద్దకూతురు మలియా గ్రాడ్యుయేషన్ గురించి ప్రస్తావిస్తూ కంటతడి పెట్టుకున్నాడు. వాషింగ్టన్ లోని సిడ్ వెడ్ ఫ్రెండ్స్ స్కూల్ నుంచి నా కూతురు మలియా గ్రాడ్యేయేషన్ పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన కార్యక్రమం శుక్రవారం జరిగింది. దానికి హాజరైన నేను ఎవరూ గుర్తుపట్టకుండా నళ్ల కళ్లద్దాలు పెట్టుకుని చివరి వరుసలో కూర్చున్నా. మలియా పట్టా తీసుకుంటున్న సమయంలో ఉద్వేగం ఆపుకోలేక ఏడ్చేశా. నా ముందు సీటులోని వాళ్లు నన్ను చూడటంతో బలవంతంగా ఏడ్పు ఆపుకున్నా. అని భావోద్వేగంతో చెప్పుకోచ్చాడు.
అగ్రరాజ్యంగా వెలుగొందుతున్నప్పటికీ అమెరికాలో లింగవివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. విద్యా, ఉద్యోగ పరమైన విషయాల్లో ఇప్పటికీ మహిళలపై వివక్షత చూపుతున్నారు. సాలీనా భారత్ లో 48 శాతం మహిళలకు ఉద్యోగాల్లో ఉపాధి కల్పిస్తుంటే, అక్కడ మాత్రం అది కేవలం 17 శాతంగానే ఉంది. దీన్ని బట్టి వివక్షత ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని నిర్మూలనకు ఒబామా హయాంలో మహిళలు, బాలికల కోసం వైట్ హౌస్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. అయినా లింగ సమానత్వం సాధించడానికి ఎంతో చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధ్యకుడిగా కంటే ఓ తండ్రిగా తన కూతురు లింగవివక్షత ఎదుర్కుని సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఒబామా.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more