67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దిల్లీలోని రాజ్ పథ్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఉత్సవాలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నారింజరంగు తలపాగా, ముదురు బూడిద రంగు కోటు ధరించి మోదీ ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ వద్ద అమర జవాన్ లకు నివాళులు అర్పించారు.
ఉగ్రదాడి ముప్పు ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో బాంబు స్క్వాడ్ తో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ మొత్తం భద్రతావలయంలో ఉంది. ఢిల్లీలో మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. దిల్లీలో గగనతలంలో విహారంపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఫ్రాన్స్- భారత్ సైనిక దళాలు రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్నాయి. దీంతో భారత గణతంత్ర వేడుకల్లో ఒక విదేశీ సైన్యం తొలిసారిగా పాల్గొన్న రికార్డు నమోదైంది. ఈ వేడుకల్లో 26 ఏళ్ళ తరువాత తొలిసారిగా శునకదళం శకటం కూడా పాల్గొంది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశంలోని మహనీయులకు ఆయన ట్విట్టర్లో నివాళి అర్పించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన అందరికీ జాతీ తరపున ధన్యవాదాలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. ముఖ్యంగా భారత రాజ్యంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన బాబా సాహెబ్ అంబేద్కర్ కృషిని ఆయన ప్రశంసించారు. అంబేద్కర్ కృషిని మరువలేనని, ఆయనకు వందనం చేస్తున్నానన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more