భారతీయ సమాజంలో గురువుకు తల్లిదండ్రులు తరువాత స్థానం ఇస్తాం. గురువును దేవుడితో సమానంగా పూజిస్తాం. అలాంటి గురుస్థానంలో వున్న ఇద్దరు గురువులు.. ఆ స్థానానికే అపఖ్యాతి తీసుకోచ్చేలా వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునేలా తమ వద్ద విద్యాబుద్దులు నేర్చుకుంటున్న ఇద్దరు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయినా తాము ఎలాంటి తప్పు చేయలేదని బుకాయించారు. ఈ ఘటన తమిళనాడుతోని పుదుకో్ట్టైలో జిల్లాలో జరిగింది.
జిల్లాలోని నమన సముత్తిరంన్నీర్ పట్టణంలో గల ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు రవిచంద్రన్ (50), పొన్నారసన్ (45) అనే ఇద్దరు ఉపాధ్యాయులు వేర్వేరుగా ఇద్దరు విద్యార్థునులపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. భాదిత విద్యార్థినుల్లో ఒకరు తొమ్మిదవ తరగతి చదువుతుండగా, మరోకరు పదో తరగతి అభ్యసిస్తున్నారు. కాగా తమకు జరిగుతున్న లైంగిక దాడులపై విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించగా, వారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పిర్యాదు చేశారు. అయితే వారి ముందు ఉపాధ్యాయులను పిలిచి ప్రశ్నించగా, తాము ఎలాంటి తప్పు చేయలేదని వారు బుకాయించారు.
దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు.. పాఠశాలకు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో అందోళన కార్యక్రమాలు చేశారు. పాఠశాలు ఎదురుగా ధర్నా నిర్వహించి.. రాస్తారోకో చేయడంతో పాఠశాల కమిటీ సభ్యులు భేటీ అయి చర్చించి ఉపాధ్యాయులపై చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ప్రధాన విద్యాశాఖ అధికారి సి శాంతి ఇరువురు ఉపాధ్యాయులను సస్సెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more