మనిషిక ప్రాణాలకు మించినదేదీ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే తాను బతికడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారు. అలాంటి ఘటనే ఒకటి జరిగింది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి గత్యంతరం లేక.. కప్పలు, బొద్దింకలను తిని ప్రాణాలను నిలబెట్టుకున్నారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 41 రోజులు గనిలో బందీలయ్యారు. గాలివెలుతురు లేని గనిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. తినడానికి తిండిలేదు.. తాగుదామంటే నీరు లేదు. కప్పలు, బొద్దింకలే వారికి ఆహారమయ్యాయి. బురదనీటితోనే దాహం తీర్చుకున్నారు. వాయవ్య టాంజానియాలోని షిన్యాంగా ప్రాంతపు బంగారు గనుల్లో చిక్కువడ్డ ఐదుగురు గనికార్మికుల దీనగాథ ఇది. ఆరోవ్యక్తి దుర్భర పరిస్థితులు తట్టుకోలేక ప్రాణాలు వదిలాడు.
వాయవ్య టాంజానియాలోని షిన్యాంగా ప్రాంతపు బంగారు గనిలో 20 మంది పనిచేస్తుండగా షాఫ్ట్ కూలింది. 14 మంది ఎలాగోలా బయటపడగలిగారు. ఆరుగురు లోపలే ఉండిపోయారు. 100 మీటర్ల లోతులో చీకటి బొయ్యారమే వారికి నివాసమైంది. అక్టోబర్ 5వ తేదీన ప్రమాదం జరిగినప్పటి నుంచి వారు లోపలే ఉండిపోయారు. మొదట్లో మైనర్ బ్యాటరీలైట్లు కొంతకాలం వెలుగునిచ్చాయి. తర్వాత సెల్ఫోన్ లైట్ల సాయంతో గడిపారు. వాటి చార్జి కూడా అయిపోయాక ఇక వెలుగు అనేదే కరువైంది. బయపడే దారిలేక బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎట్టకేలకు వారిని బయటికి తీయగలిగారు. తిండీ, నీరూ లేక చిక్కిశల్యమైపోయిన ఆ ఐదుగురిని ప్రస్తుతం హాస్పిటల్లో చేర్చి చికిత్స చేస్తున్నారు. వీరు బతికి బట్టకట్టడం నమ్మశక్యంగా లేదని స్థానికులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more