భారత ప్రధాని నరేంద్ర మోదీ చాణిక్య నీతి గురించి దేశం మొత్తం తెలుసు. సార్వత్రిక ఎన్నికల్లో తన పేరునే మంత్రంగా దేశం మొత్తం పఠించేలా చెయ్యడం ఒక్క మోదీకే సాధ్యపడింది. తాజాగా జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రసంగంలోనూ తన మార్క్ ను చూపించారు. దేశానికి ఎంతో సేవ చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మోదీ వేనోళ్ల కీర్తించారు. దేశాన్ని ఐక్యం చేసిన ఒకే ఒక్క నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రమే అని అన్నారు. పటేల్ ఏ కుటంబాన్ని రాజకీయంగా సపోర్ట్ చెయ్యలేదని పరోక్షంగా కాంగ్రెస్ ను ఉద్దేశించి అన్నారు. అలాగే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశం సమగ్రంగా ఉంది అంటే దానికి పటేల్ చేసిన విశేష కృషి కారణం అంటూ పొగిడారు.
దేశానికి సమైక్యమే బలం అని మోదీ వివరించారు. ఒక్కసారి 125 కోట్ల భారతీయులు దేశం కోసం సమైక్యంగా ముందుకు కదిలితే.. దేశం 125 కోట్ల అడుగులు ముదుకు వెళుతుందని మోదీ వెల్లడించారు. దేశానికి సమైక్యతనే బలం అని పటేల్ మనకు అందించిన సందేశం అని మోదీ వివరించారు. పటేల్ గురించి మాట్లాడిన మోదీ.. చివర్లో ఇందిరాగాంధీని కూడా ప్రస్తావించారు. దేశ రాజకీయాల్లో తన ముద్రను వేసిన ఇందిరా గాంధీ నింగికేగిన రోజు కూడా ఇదే అని.. అది తాను మరిపోలేనని అన్నారు. మొత్తానికి ఎన్డీయే బ్రాండ్ అండాసిడర్ గా సర్దార్ పటేల్ ను చెబుతూనే.. ఇందిరా గాంధీని ప్రస్తావించారు మోదీ. ఇలా ఇద్దరు భిన్న నేపధ్యాలు ఉన్న నాయకులను ఒకే సారి కవర్ చెయ్యడం మోదీకే చెల్లింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more