ఎమ్మెల్యేలు అంటే ప్రజాధనంతో ముడిపడిన వాళ్లు అని అందరికి తెలుసు. అయితే ఎలా ఎమ్మెల్యే అయినా కానీ ఎమ్మెల్యేగా ఉంటున్నందుకు ప్రభుత్వం తరఫున ఎంతో కొంత జీతం రూపంలో అందుతుంది. అయితే అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు ఒకే రకమైన జీతం అందడం లేదు. నిజానికి తమ జీతం పెంచుకోవాలంటే ఎంపీలు ఎలా అయితే కనీసం చర్చ కూడా లేకుండా నిమిషాల్లో బిల్ పాస్ చేయించుకుంటారో మనం చూశాం. తాజాగా అలాగే ఓ రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేల జీతాల పెంపు మీద చర్చసాగుతోంది. అయితే జీతం పెంపు అంటే ఏదో అయిదు శాతమో, పది శాతమో అనుకుంటున్నారేమో కానే కాదు అక్షరాల నాలువందల శాతం అధికం. అవును అంతకు ముందు జీతం కంటే కూడా నాలుగువందల శాతం అధికంగా జీతానికి సిఫార్సులు సిద్దమయ్యాయి. అయితే ఎమ్మెల్యేలు అంటే ఆ మాత్రం ఖర్చులుండవా ఏంటి అని వెనకేసుకునే వాళ్లు వెనకేసుకొస్తున్నాకానీ కొంత మంది మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ అదృష్టం ఏ ఎమ్మెల్యేలకు వచ్చిందో తెలుసా....?
దిల్లీ... దేశ రాజధానిగా అందరికి తెలుసు. అక్కడ ఆప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల కథనాలు, వార్తలు వచ్చాయి. మార్పులు తీసుకువస్తామంటూ అక్కడి కరెంట్ బిల్లుల్లో, వాటర్ బిల్లుల్లో కొన్ని భారీ మార్పులు కూడా తీసకువచ్చారు. సరే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తాజాగా తమ జీత భత్యాలను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. నిన్నటి దాకా వచ్చిన జీతం కన్నా నాలుగువందల శాతం అధికాన్ని వారు పొందేందుకు సిద్దపడుతున్నారు. నెలకు కేవలం 12 వేల రూపాయలు ఉన్న జీతాన్ని ఏకంగా యాభై వేలకు పెంచుకున్నారు. అలా జీతం, అలవెన్స్ లు కలిపితే దాదాపుగా రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల వరకు జీతం వచ్చేలా కొత్త బిల్ తీసుకువస్తున్నారు. ఎమ్మెల్యేల ఆఫీసులకు అద్దెలు, ఫర్నీచర్ అంటూ బాగానే తీసుకునేందుకు బిల్ తీసుకువచ్చారు. మొత్తంగా దేశంలోనే అధికంగా జీతం అందుకునే ఎమ్మెల్యేలుగా దిల్లీ ఎమ్మెల్యేలు రికార్డుకెక్కనున్నారు. అయినా రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అన్న చందంగా ఉంది పరిస్థితి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more