డబ్బు మనుషుల్ని ఎన్ని పెడదారులు పట్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సొంత కుటుంబసభ్యులే ఆస్తిని కాజేయడం కోసం మర్డర్ ప్లాన్ చేసేంత స్థితికి జారిపోతున్నారంటే నేటి రోజుల్లో ‘డబ్బు’కు ప్రాధాన్యత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ‘డబ్బు’ ఓ తల్లిని తన కూతురితో ప్రేమ వల వేయించి, కిడ్నాప్ కు పాల్పడిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. థ్రిల్లర్ సినిమాలా తలపించే ఈ రియల్ సస్పెన్స్ కథ పోలీసులనే ముచ్చెమటలు పట్టించింది. చివరికి ఆ తల్లి కటకటాలపాలైంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు చెన్నై సమీపం ఊరపాక్కంకు చెందిన ఖుర్షిత్ (40) అనే మహిళ అడ్డదారిలో డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకుంది. గతకొన్నాళ్ల నుంచి తన భర్తను విడిచిపెట్టి వేరుగా వుంటున్న ఈ మహిళకు గిండీలోని ఒక ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న భాను అనే కూతురు వుంది. భర్తలేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఖుర్షిత్ కు... శంకర్ అనే వ్యక్తి ఇచ్చిన సలహాతో ఆమె కిడ్నాప్ పథకం పన్నింది. శంకర్ అనే ఆ వ్యక్తి చెన్నై పోయస్గార్డెన్కు చెందిన రవిసుందరం హోల్సేల్ వ్యాపారి ఇంటికి వాటర్ క్యాన్ సరఫరా చేసేవాడు. ఆ వ్యాపారి ఆస్తిపరుడని, అతనికి అభిషేక్ అనే ఓ కుమారుడు వున్నాడని, అతనికి తన కూతురితో ప్రేమవల వేయించి, ఆ తర్వాత అతడ్ని కిడ్నాప్ చేసి డబ్బు కాజేయాలని ఖుర్షిత్ కు శంకర్ సలహా ఇచ్చాడు. అతనిచ్చిన సలహా మేరకు ఖుర్షిత్ తన కుమార్తె భానుకు అభిషేక్ సెల్ఫోన్ నెంబరు అందజేసి మిస్డ్కాల్ ఇమ్మంది. తల్లి సలహాతో నెలరోజులుగా మాటలతోనే అతనిలో ప్రేమను రగిల్చిన భాను... ఎలాగైనా నేరుగా చూడాలనే తపన స్థాయికి అభిషేక్ను తీసుకువచ్చింది. శనివారం మోటార్బైక్పై అభిషేక్ భానును కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక కారులో సరదాగా ప్రయాణిస్తుండగా.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వారి కారును మరోకారులో కిడ్నాపర్లు వెంబడించి కిడ్నాప్నకు పాల్పడ్డారు. విమానాశ్రయం వద్ద డబ్బుముట్టగానే అభిషేక్ను విడిచిపెట్టాలని భావించారు. అయితే ఇంతలో కథ అడ్డం తిరిగింది.
‘రూ.5 కోట్లు చెల్లించి అభిషేక్ను తీసుకెళ్లు, అలా కాకుండా పోలీస్లకు సమాచారం ఇచ్చావంటే కొడుకుని ప్రాణాలతో చూడవు’ అంటూ ఆదివారం ఉదయం అభిషేఖ్ తల్లిని అతని సెల్ఫోన్ ద్వారానే అగంతకులు బెదిరించారు. కొడుకును కిడ్నాప్ చేశారని తెలుసుకున్న తండ్రి రవిసుందరం.. నగర పోలీస్ కమిషనర్ జార్జ్కు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఈ కిడ్నాప్ ఉదంతాన్ని ఛేదించేందుకు ఐదుగురితో కూడిన పోలీస్ బృందం రంగంలోకి దిగింది. అగంతకుల మరో ఫోన్ కోసం ఆదివారం అంతా వేచి చూశారు కానీ ఫలితం లేకపోయింది. అయితే.. సోమవారం తెల్లవారుజాము 2 గంటలకు ఫోన్చేసి డబ్బుతో కాశిమేడుకు రావాలని చెప్పారు. రవిసుందరం, పోలీసులు వేసుకున్న పథకం ప్రకారం.. అగంతుకులు చెప్పినట్లు చేశారు. రవిసుందరం కాశీమేడుకు వెళ్లగా అగంతకులు ఆవడికి రావాలని అన్నారు. ఆవడికి వెళ్లితే ఇక్కడ కాదు తేనాంపేటకు రావాలని చెప్పారు. తేనాంపేట సిగ్నల్ వద్ద అగంతకులు రవిసుందరాన్ని కలుసుకుని.. ‘డబ్బును మీ వెనుక వచ్చేవారు తీసుకుంటారు, కుమారుడిని విడిచిపెడుతున్నాం’ అన్నారు. ‘నా కుమారుడిని ప్రత్యక్షంగా చూస్తేనే డబ్బు ఇస్తాన’ని రవిసుందరం వాదించాడు. వీరి మధ్య ఇలా సంభాషణ సాగుతుండగానే రవిసుందరం కారు వెనుక అగంతకులతో అనుసరిస్తున్న మరో కారును పోలీసులు పట్టుకున్నారు.
ఆ కారులో సద్దాంహుస్సేన్ (27), అహ్మద్ బతక్ (25) కిడ్నాపర్లు ఉన్నారు. వీరిద్దరినీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా, చెన్నై విమానాశ్రయం వద్ద అభిషేక్తో మరికొందరు నిందితులు ఉన్నట్లు తెలుసుకున్నారు. పోలీసుల బృందం విమానాశ్రయానికి వెళ్లగా.. వీరి రాకను గమనించిన అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సైతం వారి వెంటపడడంతో భీతిల్లిన కిడ్నాపర్లు పల్లవరం పాన్స్ కంపెనీ సమీపంలో అభిషేక్తో సహాకారును వదిలిపెట్టి పారిపోయారు. పారిపోయిన నిందితుల్లో రిజ్వాన్ (26) అనే మరోవ్యక్తిని పోలీసులు పట్టుకోగా.. మరో ఇద్దరు పారిపోయారు. మొత్తం వ్యవహారంలో రవిసుందరం కారు డ్రైవరు, సహాయకులుగా పోలీసులే వ్యవహరించారు. కిడ్నాప్ కథను సుఖాంతం చేసిన పోలీసులు ఖుర్షిత్ను అరెస్ట్ చేయగా, ప్రేమవల విసిరిన కుమార్తె భాను పరారైంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more