ప్రపంచవ్యాప్తంగా ‘ఐ ఫోన్’కు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సిరీస్ కు సంబంధించి ఏదైనా కొత్త మోడల్ మార్కెట్ లోకి వచ్చిందంటే చాలు.. జనాలు ఎగబడి మరీ తీసుకుంటుంటారు. ఇక భారత్ లోనూ అదే పరిస్థితి. ఎంత విలువైనా ఫర్వాలేదు.. దాన్ని కొనేందుకు పోటీ పడుతుంటారు. భారత్లో అధికారికంగా విడుదలకు ముందే తమ చేతుల్లో కొత్త మోడల్ ఉండాల్సిందేనని ఫక్సవుతారు. ఇందుకోసం ప్రీమియం ఎంతైనా చెల్లిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా.. భాగ్యనగరానికి చెందిన ఓ వ్యక్తినే తీసుకోవచ్చు.
ఐఫోన్ కొత్త మోడళ్లు 6ఎస్, 6ఎస్ ప్లస్ సెప్టెంబర్ 25న యూఎస్, యూకే సహా 12 దేశాల్లో విడుదలయ్యాయి. భారత్లో అక్టోబర్ 16న విడుదల కానున్నాయి. కానీ.. భాగ్యనగరానికి చెందిన ఓ కస్టమర్ దేశంలో ఆ ఫోన్ ఇంకా విడుదల కాకముందే అంటే సెప్టెంబర్ 26వ తేదీన 6ఎస్ను చేజిక్కించుకున్నాడు. పైగా.. అతను చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.1.20 లక్షలు. దీన్ని బట్టి ‘ఐ ఫోన్’పై ఇక్కడివారి ఆసక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక భారత్ గ్రే మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. లక్షకుపైగానే పలుకుతోందని వ్యాపార వర్గాలు తెలిపాయి. నలుగురిలో తమ ప్రత్యేకత ప్రదర్శించాలనుకునే కొందరు కస్టమర్లు ఆ ఫోన్లు విడుదల కాకముందే బారీ ఖర్చు వెచ్చించి మరీ ఎలాగోలా విక్రయిస్తున్నారు. ఇటువంటి ‘విలువైన’ కస్టమర్ల కోసం హాంకాంగ్, సింగపూర్ నుంచి కొందరు వ్యాపారులు ఫోన్లను తీసుకొచ్చి అధిక ధరలకు అమ్మేస్తున్నారు. ఏడుగురు యువకుల నుంచి ఏకంగా 182 ఫోన్లను కస్టమ్స్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నారని సమాచారం.
ఇదిలావుండగా.. ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ మోడళ్లను సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ రంగుల్లో ఆపిల్ రూపొందించింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన రోజ్ గోల్డ్కు ప్రపంచవ్యాప్తంగా విపరీత డిమాండ్ ఉంది. నల్లబజారులో అధిక ధర పలుకుతున్న రంగు కూడా ఇదే కావడం విశేషం. చైనాలో అతిపెద్ద గ్రే మార్కెట్ అయిన హువాకియాంగ్బేలో రోజ్ గోల్డ్ రూ.2.15 లక్షలు పలికింది. ఐఫోన్ 5ఎస్ మోడల్ను తొలిసారిగా బంగారు వర్ణంలో ప్రవేశపెట్టినప్పుడు సైతం గ్రే మార్కెట్లో భారత్లో రూ.లక్షకు పైనే పలికింది. కాగా, 6ఎస్, 6ఎస్ ప్లస్ అడ్వాన్స్ బుకింగ్స్లో 70% మంది రోజ్ గోల్డ్ను కోరారని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. బిగ్ సి, లాట్లోనూ బుకింగ్స్లో 70% మంది ఇదే కలర్ను ఎంచుకున్నారు. భారత్లో 6ఎస్ ధర 16 జీబీ రూ.55,000, 64 జీబీ రూ.65,000, 128 జీబీ రూ.75,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 6ఎస్ ప్లస్ ధర వేరియంట్ను బట్టి అదనంగా రూ.8-9 వేలు ఉండొచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more