విశ్వవ్యాప్తంగా పేరుగాంచిన నగరాల్లో ఒకటిగా పేరుగాంచిన హైదరాబాద్.. ఇప్పుడు ‘హత్యల సిటీ’గా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఆ నగరంలోని పాతబస్తీలో వరుసగా జరుగుతున్న ఘటనలే అందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఘర్షణకు దిగుతున్న అక్కడి వ్యక్తులు మానవత్వం రాక్షసులుగా వ్యవహరిస్తూ రక్తపాతానికి తెగబడుతున్నారు. మొన్నటికి మొన్న చిన్న జట్కా బండి కోసం ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన కత్తి ఫైటింగ్ లో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయిన ఘటన తీవ్ర సంచలనానికి దారితీసిన విషయం తెలిసింది. తాజాగా ఆదివారం అదే ప్రాంతంలో నెలకొన్న చిన్న వివాదంలో మరో వ్యక్తి హత్యకు దారి తీసింది. పైగా.. సొంత మేనమామ తన అల్లుడిని చంపేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పూర్తి వివరాల్లోకెళితే... పాతబస్తీ పరిధిలోని భవానీ నగర్ కు చెందిన హైదయత్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఓ వివాహ విందు (వలీమా) జరిగింది. అప్పటిదాకా ఆ వేడుక ఓ పండగలా జరిగింది. బంధుమిత్రులతో, సన్నిహితులతో నిండిపోయిన ఆ వేడుక ఆనందంగా కొనసాగింది. కానీ.. ఇంతలోనే ఎవరూ ఊహించని ఓ విషాద ఘటన ఆ ఫంక్షన్ లో చోటు చేసుకుంది. ఆ విందులో భాగంగా అహ్మద్ అనే యువకుడిపై అతడి మేనమామ కత్తితో దాడి చేశాడు. తన భార్యకు సంబంధించి నగల విషయంలో అల్లుడితో గొడవపడ్డ మేనమామ ఒక్కసారిగా ఆగ్రహావేశంతో ఊగిపోయాడు. అంతే! కత్తి తీసి అల్లుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో అహ్మద్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అతడు చనిపోయాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. అప్పటిదాకా వేడుకగా జరుగుతున్న వలీమా ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదాన్ని నింపుకుంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more