తెలంగాణ తెలుగుదేశం పార్టీ పైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరో సారి వార్తల్లోకెక్కారు. గతంలో ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రేవంత్ రెడ్డి వ్యవహారం గురించి అందరికి తెలుసు. అయితే ఓటుకు నోటు వ్యవహారం కేసులో బెయిల్ పొందిన రేంవత్ రెడ్డి గత కొంత కాలంగా కోర్ట్ఖ ఉత్తర్వుల మేరకు తన నియోజక వర్గం లోనే ఉంటున్నారు. కోర్ట్ అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లడానికి వీలులేదని హైకోర్ట్ విడుదల సమయంలో గట్టిగా హెచ్చిరించింది. దాంతో రేవంత్ తన స్వంత నియోజక వర్గానికి మాత్రమే పరిమితమయ్యారు.అయితే తాజాగా పోలీసులు మరోసారి రేవంత్ రెడ్డిని అరెస్టు చెయ్యడంతో వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి పోలీసులు ఓటుకు నోటు కేసులో కాకుండా వేరే కేసులో అరెస్ట్ చెయ్యడం విశేషం. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చెయ్యడమే కాకుండా రేవంత్ రెడ్డి అనుచరుల మీద పోలీసులు లాఠీలు ఝులిపించారు.
మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ లోని మార్కెట్ యార్డ్ లో కొత్తగా నిర్మించనున్న గోడౌన్ శంఖుస్థాపన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు విచ్చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన అనుచరులతో ఆ కార్యక్రమానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మంత్రి స్థానిక ఎమ్మెల్యేను కలుపుకుపోకుండా ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తన అనుచరలతో కలిసి అక్కడికి చేరుకోగా టిడిపి కార్యకర్తలు ప్రభుత్వానికి, జూపల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అక్కడే ఉన్న టిడిపి కార్యకర్తలు, రేవంత్ అభిమానులు పోలీసుల వాహనం మీదకు రాళ్లు రువ్వడంతో పరిస్థితి దారుణంగా మారింది. దాంతో పోలీసులు వారి మీద లాఠీఛార్జ్ చేశారు. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more