తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడిగా దాదాపు నెల రోజుల పాటు జైలులో ఉన్న రేవంత్ రెడ్డిని అందలం ఎక్కించనున్నారా.? సీనియర్లు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్. రమణ, మోత్కుపల్లి లాంటి నేతలను కాదని తెలంగాణలో రేవంత్ కు పట్టం కట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన వాయిస్ అంటే ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే. అయితే మిగిలిన నేతలు ఉన్నా కానీ రేవంత్ రెడ్డి చేసినంత వాడి, వేడిగా విమర్శలు గుప్పించలేరు.
Also Read: అల్లుడు ఆణిముత్యమైతే.., మామ స్వాతి ముత్యమట... మరి తనేముత్యమో..!!
* సీనియారిటీ కన్నా పార్టీకి మేలు చేసే వాటి మీదనే తెలుగుదేశం పార్టీ దృష్టిసారించిందా..?
* సీనియర్ నేతలు ఎంత మంది ఉన్నా కానీ రేవంత్ రెడ్డి ఉన్న ప్రాధాన్యత దృష్య రేవంత్ కి తెలంగాణలో పట్టంకట్టే ఆలోచనలో ఉన్నారు.
* సీనియర్ నాయకులు ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ తరఫున రేవంత్ కు ఇస్తున్నంత ప్రాధాన్యత ఎవరికి లభించడం లేదు.
* రేవంత్ రెడ్డి చేసినంత సూటిగా, వాడి వేడిగా ఏ టిడిపి నాయకులు కూడా విమర్శలు చేయలేకపోతున్నారు.
* ఇప్పటికే రేవంత్ రెడ్డికి వచ్చిన విపరీతమైన పాపులారిటీని పార్టీకి ప్రయోజనకరంగా వాడుకోవాలని టిడిపి యోచన.
* కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డి లాంటి నేతలే అయితే కరెక్ట్ అని చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు బావిస్తున్నారు.
* రేవంత్ రెడ్డికి అనుకూలంగా అప్పుడే చాలా మంది భజన కూడా ప్రారంబించారు.
* కొత్తకోట దయాకర్ రెడ్డి అందరి కంటే ముందుగానే ఊహించి ఏకంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సిఎం అని ప్రకటించేశారు.
* అయితే ఇదంతా రేవంత్ ను బుజ్జగించడానికి చేస్తున్న ప్రయత్నం అని కొంత మంది వాదన.
* తెలుగుదేశం పార్టీ తెరాసను ఎదుర్కోవడానికి వేస్తున్న గేమ్ ప్లాన్ లో భాగంగానే రేవంత్ ను తెర మీదకు తీసుకువస్తున్నారని మరి కొందరి భావన.
Also Read: ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే.. కేసీఆర్ ను పక్కనపెట్టండి!
Also Read: నాకు బెయిల్ రావడమే ఆయనకు జ్వరాన్ని తెప్పించిందా..?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more