ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సీమాంధ్రుల రక్షణ కోసం విభజన చట్టంలోని సెక్షన్ 8ను అమలు చెయ్యాలని ఏపి ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర వత్తిడి తీసుకువస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. అయితే హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు ప్రస్తావనే లేదని గతవారమే స్పష్టతనిచ్చిన కేంద్ర హోంశాఖ.. ఇప్పుడు లిఖితపూర్వకంగా అదే విషయాన్ని కుండబద్దలుకొట్టింది. కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్రెడ్డి రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు జూన్ 16న ఈ మేరకు ఒక లేఖ పంపింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని బాధ్యతలూ తీసుకుంటుందని స్పష్టంచేసినందున గవర్నర్కు అదనపు బాధ్యతలు ఇచ్చే అంశం ముగిసిపోయినట్లేనని తేల్చిచెప్పింది. కేంద్రప్రభుత్వం ఈ అంశాన్ని మూసివేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌధురి స్పష్టంచేశారు. కనుక గత సంవత్సరం గవర్నర్కు కేంద్ర హోంశాఖ ఇచ్చిన మెమొరాండంను అమలుచేయడం లేదా ఉపసంహరించుకోవడం అనే ప్రస్తావనే ఉండదని తేల్చిచెప్పారు.
గత సంవత్సరం జూన్ 2నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పనిచేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు సంబంధించిన అంశంపై సెక్షన్ 8 ప్రకారం గవర్నర్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ గత సంవత్సరం జూన్ 4న ఒక లేఖ (మెమొరాండం) రాసింది. ఈ అంశాన్ని ఎంపీ పాల్వాయి గోవర్ధనరెడ్డి రాజ్యసభలో గత సంవత్సరం జూలై 22న ప్రత్యేక ప్రస్తావన (స్పెషల్ మెన్షన్)గా లేవనెత్తారు. గవర్నర్కు అదనపు బాధ్యతలకు సంబంధించి కేంద్రం రాసిన సదరు లేఖను ఉపసంహరించుకోవాలని కోరారు. దీనికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ నెల 16న లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న నిబంధనల మేరకు గవర్నర్కు గత సంవత్సరం జూన్ 4వ తేదీన కేంద్ర హోం శాఖ ఒక మెమొరాండం పంపిందని, అదనపు బాధ్యతల గురించి ప్రస్తావించిందని తాజా లేఖలో హోంశాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు. అయితే గవర్నర్కు పంపిన సదరు మెమొరాండంలో వెంటనే అదనపు బాధ్యతలను నిర్వహించాలన్న ఉత్తర్వులు లేదా ఆదేశం ఇవ్వలేదని వివరించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా వివరణ కోరామని, దానికి అనుగుణంగానే ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more